Share News

Taapsee Pannu : ఓటీటీలు మునుపటిలా...

ABN , Publish Date - Jul 07 , 2024 | 12:23 AM

ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన తాప్సీ.. తన రూటు మార్చి సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి కొన్ని హిట్‌ చిత్రాలను ఖాతాలో వేసుకున్న ఆమె ఇటీవలే ‘డుంకీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.

 Taapsee Pannu : ఓటీటీలు మునుపటిలా...

ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన తాప్సీ.. తన రూటు మార్చి సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి కొన్ని హిట్‌ చిత్రాలను ఖాతాలో వేసుకున్న ఆమె ఇటీవలే ‘డుంకీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. తాప్సీ లేటెస్ట్‌గా ‘ఫిర్‌ ఆయీ హసీనా దిల్‌రుబా’ చిత్రంలో నటించారు. ‘ట్వల్త్‌ ఫెయిల్‌’ సినిమా ఫేమ్‌ విక్రాంత్‌ మాసీ ఇందులో కథానాయకుడిగా నటించారు. 2021లో విడుదలైన ‘హసీనా దిల్‌రుబా’ చిత్రానికి ఇది సీక్వెల్‌. త్వరలోనే ఓటీటీలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మీడియాతో పలు విషయాలను పంచుకున్నారు.

‘‘కొన్నాళ్ళుగా చిన్న సినిమాలకు పెద్దదిక్కుగా ఓటీటీ సంస్థలుండేవి. థియేటర్లలో రిలీజ్‌ కాలేని చిత్రాలు నేరుగా ఓటీటీలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకునేవి. కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థలు సైతం రూటు మార్చాయి. చిన్న చిత్రాలను మునుపటిలా తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. స్టార్‌ కాస్టింగ్‌ లేని చిన్న చిత్రాల కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లను నిర్వహించాలని.. వీటికి చాలా డబ్బులు ఖర్చు అవుతుందని వెనుకడుగు వేస్తున్నాయి. అలాగే, ఆ చిత్రాలను ముందుగా థియేటర్లలో రిలీజ్‌ చేశాకే.. ఓటీటీలోకి తీసుకుంటామని షరతులు పెడ్తున్నాయి. ఈ నిర్ణయం చిన్న సినిమాలపై చాలా ప్రభావం చూపిస్తోంది’’ అని చెప్పారు.

Updated Date - Jul 07 , 2024 | 12:23 AM