Share News

NRI: జీడబ్ల్యూటీసీఎస్‌ స్వర్ణోత్సవం! ఏపీ మంత్రులు, స్పీకర్‌కు సంస్థ ఆహ్వానం

ABN , Publish Date - Jul 21 , 2024 | 06:19 PM

వాషింగ్టన్‌లోని తెలుగువాళ్లకు గత 50 సంవత్సరాలుగా సేవలందిస్తున్న గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు కల్చరల్‌ సంఘం గోల్డెన్‌ జూబ్లి వేడుకలను నిర్వహించనుంది. ఈ వేడుకలకు రావాల్సిందిగా పలువురు ప్రముఖులను సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం స్వయంగా కలిసి ఆహ్వానించారు.

NRI: జీడబ్ల్యూటీసీఎస్‌ స్వర్ణోత్సవం! ఏపీ మంత్రులు, స్పీకర్‌కు సంస్థ ఆహ్వానం

ఎన్నారై డెస్క్: వాషింగ్టన్‌లోని తెలుగువాళ్లకు (NRI) సేవలందిస్తున్న గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు కల్చరల్‌ సంఘం (జిడబ్ల్యుటిసిఎస్‌) ఏర్పాటై 50 సంవత్సరాలు అవుతోంది. ఈ నేపథ్యంలో గోల్డెన్‌ జూబ్లి వేడుకలను వాషింగ్టన్‌ డీసీలో సెప్టెంబర్‌ 27,28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా పలు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, రాజకీయ నాయకులతో ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కృష్ణ లాం చెప్పారు. ఈ స్వర్ణోత్సవ వేడుకలకు రావాల్సిందిగా పలువురు ప్రముఖులను సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం స్వయంగా కలిసి ఆహ్వానించారు.

NRI: మెల్బోర్న్‌లో టీడీపీ గెలుపు సంబరాలు

3.jpg


తన ఇండియా పర్యటనలో భాగంగా తెలుగు దేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి లోకేష్‌ను, రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి అనిత, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు, జనసేన నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర, సినిమా దర్శకుడు కొరటాల శివను కృష్ణ లాం కలుసుకుని స్వర్ణోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. తెలంగాణలో కూడా పలువురు ప్రముఖులను కలిసి ఈ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించినట్లు కృష్ణలాం తెలిపారు.

2.jpg4.jpgRead Latest NRI News and Telugu News

Updated Date - Jul 21 , 2024 | 06:27 PM