Share News

NRI News: ఛార్లెట్‌లో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ

ABN , Publish Date - Jun 17 , 2024 | 07:00 AM

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అఖండ విజయం సాధించడంపై ఎన్ఆర్ఐలు(NRI) హర్షం వ్యక్తం చేస్తున్నారు.

NRI News: ఛార్లెట్‌లో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అఖండ విజయం సాధించడంపై ఎన్ఆర్ఐలు(NRI) హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని నార్త్‌ కరోలినాలో ఛార్లెట్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘనంగా విజయోత్సవ సంబరాలను జరుపుకున్నారు.

125 కార్లతో విజయోత్సవ ర్యాలీతోపాటు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఛార్లెట్‌లోని మేనర్‌ ఫామ్‌హౌజ్‌లో వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమానికి దాదాపు 1,000 మందికిపైగా హాజరయ్యారు.


అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్నారై నేతలను పలువురు అభినందించారు. గుంటూరు ఎంపీగా గెలిచిన డా. చంద్ర పెమ్మసానిని, ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్‌ కాకర్ల, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్‌కుమార్‌, తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రామును ఎన్‌ఆర్‌ఐలు అభినందించారు.

కూటమి గెలుపుకోసం తాము పడ్డ కష్టాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు జూమ్ ద్వారా కనెక్ట్ అయ్యారు. తమ గెలుపుకోసం చేసిన కృషిని మరవలేమంటూ ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని అన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 07:00 AM