Share News

NRI: బ్రిస్బేన్‌లో టీడీపీ విజయోత్సవ సంబరాలు!

ABN , Publish Date - Jul 09 , 2024 | 03:28 PM

ఎన్డీఏ గెలుపును దేశవిదేశాల్లోని ఎన్నారైలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జూలై 6న టీడీపీ విజయోత్సవ సంబరాలు క్వీన్స్ ల్యాండ్ తెలుగు దేశం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

NRI: బ్రిస్బేన్‌లో టీడీపీ విజయోత్సవ సంబరాలు!

  • ముఖ్య అతిథిగా టాలీవుడ్ నటుడు శివాజీ

ఎన్నారై డెస్క్: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సీఎంగా చంద్రబాబు ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్డీఏ గెలుపును దేశవిదేశాల్లోని ఎన్నారైలు (NRI) సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జూలై 6న టీడీపీ విజయోత్సవ సంబరాలు క్వీన్స్ ల్యాండ్ తెలుగు దేశం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ నటుడు శివాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బెల్ బర్డ్ పార్క్, విక్టరీ చర్చ్‌లో ఉదయం 10 గంటల నుంచి ఈ విజయోత్సవ సంబరాలు ప్రారంభమయ్యాయి. డీజే, డ్యాన్స్ ప్రోగ్రామ్, పిల్లల ఆటపాటలు, మ్యాజిక్ షో, ఫేస్ పెయింటింగ్, బెలూన్ ట్విస్టింగ్ వంటి కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.

5.jpg

NRI: ఏపీలో ఎన్డీఏ విజయం.. మేరీల్యాండ్‌లో ఎన్నారైల విజయోత్సవ సంబరాలు


ఈ విజయోత్సవ సంబరాలకు ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. క్వీన్స్ ల్యాండ్ తెలుగు దేశం కమిటీ అధ్యక్షుడు విశ్వ దాసరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆహూతులందరికీ రుచికరమైన ఆంధ్రా విందు భోజనం వండివార్చారు. క్వీన్స్ ల్యాండ్ తెలుగుదేశం కమిటీ సభ్యులు దత్తాత్రేయ బొమ్మసాని, మాధవ్ జొన్నలగడ్డ, భరత్వాజ్ చింతపల్లి, ప్రసాద్ దబ్బర్, నాగార్జున యడ్ల, వంశీ చందు పుట్టగుంట, రామ కృష్ణ గూడూరు, భార్గవ సత్య దాసరి, రాజేష్ కణికంటి, రవి చౌదరి గడ్డిపాటి, సాయి కృష్ణ వడ్డే, రూపా మనోహర్ అరే, మణి గొట్టుముక్కల, పార్థసారథి నున్న, ప్రసాద్ కోనేరు, గౌతం మంచికలపూడిలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

3.jpg1.jpg6.jpg2.jpg

Read Latest NRI News and Telugu News

Updated Date - Jul 09 , 2024 | 03:34 PM