Share News

NRI: మెల్బోర్న్‌లో టీడీపీ గెలుపు సంబరాలు

ABN , Publish Date - Jul 16 , 2024 | 07:53 PM

ఆస్ట్రేలియా మెల్బోర్న్‌లో టీడీపీ గెలుపు సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు శివాజీ హాజరయ్యారు.

NRI: మెల్బోర్న్‌లో టీడీపీ గెలుపు సంబరాలు

ఎన్నారై డెస్క్: ఆస్ట్రేలియా మెల్బోర్న్‌లో టీడీపీ గెలుపు సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు శివాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నారై (NRI) టీడీపీ తరఫున ప్రకటించిన లక్ష ఉద్యోగ అవకాశాలను అమలుపరచాలని కోరారు. అలాగే వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కోట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. దాదాపు 1100 మంది టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు విజయోత్సవ సంబరాలకు హాజరై సభను జయప్రదం చేశారు. తెలుదేశం మెల్‌బోర్న్ కమిటీ ఆధ్వర్యంలో న భూతో న భవిష్యత్ అనేలా సభను నిర్వహించారు. మెల్‌బోర్న్ టీడీపీ పార్టీ అధ్యక్షుడు లగడపాటి సుబ్బారావు ఆధ్వర్యంలో సభా కార్యక్రమాన్ని నిర్వహించారు.

NRI: బ్రిస్బేన్‌లో టీడీపీ విజయోత్సవ సంబరాలు!

1.jpgRead Latest NRI News and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 07:53 PM