Share News

శరణార్థులుగా..

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:01 AM

ఐవోసీ శరణార్థుల జట్టు పతాకధారులుగా బాక్సర్‌ సిండీ ఎంగామ్‌బా, తైక్వాండో అథ్లెట్‌ యహ్యా అల్‌ గోటనీ వ్యవహరించనున్నారు. కామెరూన్‌లో జన్మించిన సిండీ యూకేకు వలస వెళ్లగా..

శరణార్థులుగా..

ఐవోసీ శరణార్థుల జట్టు పతాకధారులుగా బాక్సర్‌ సిండీ ఎంగామ్‌బా, తైక్వాండో అథ్లెట్‌ యహ్యా అల్‌ గోటనీ వ్యవహరించనున్నారు. కామెరూన్‌లో జన్మించిన సిండీ యూకేకు వలస వెళ్లగా.. సిరియా అంతర్యుద్ధం కారణంగా యహ్యా తన కుటుంబంతో కలసి జోర్డాన్‌ పారిపోయాడు. రెఫ్యూజీ టీమ్‌లో ఉన్న 37 మంది అథ్లెట్లు 12 క్రీడా విభాగాల్లో బరిలోకి దిగనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్లకుపైగా ఉన్న శరణార్థులకు వీరు ప్రాతినిథ్యం వహించనున్నారని ఐవోసీ పేర్కొంది. 2016 రియో ఒలింపిక్స్‌ నుంచి శరణార్థుల జట్టు మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగుతోంది.

Updated Date - Jul 26 , 2024 | 04:01 AM