Share News

శాంసన్‌కు జరిమానా

ABN , Publish Date - May 09 , 2024 | 05:08 AM

ఐపీఎల్‌ క్రమశిక్షణ కోడ్‌ను ఉల్లంఘించిన రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు మ్యాచ్‌ ఫీజులో 30 శాతం కోత పడింది. మంగళవారం ఢిల్లీతో మ్యాచ్‌లో 222 పరుగుల ఛేదనలో...

శాంసన్‌కు జరిమానా

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ క్రమశిక్షణ కోడ్‌ను ఉల్లంఘించిన రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు మ్యాచ్‌ ఫీజులో 30 శాతం కోత పడింది. మంగళవారం ఢిల్లీతో మ్యాచ్‌లో 222 పరుగుల ఛేదనలో రాజస్థాన్‌ 20 పరుగులతో ఓడింది. అయితే ఈ మ్యాచ్‌లో శాంసన్‌ (86) ధాటిగా ఆడుతున్న సమయంలో 16వ ఓవర్‌లో బౌండ్రీ రోప్‌ వద్ద షాయ్‌ హోప్‌ తీసుకొన్న వివాదాస్పద క్యాచ్‌తో అతడు అవుటయ్యాడు. క్యాచ్‌ అందుకొంటున్నప్పుడు హోప్‌ కాళ్లు బౌండ్రీ రోప్‌ను తాకినట్టుగా కనిపించింది. కానీ, థర్డ్‌ అంపైర్‌ మాత్రం తనను అవుట్‌గా ప్రకటించడంపై సంజూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫీల్డ్‌ అంపైర్‌తో వాగ్వాదానికి కూడా దిగాడు. లెవల్‌-1 ఉల్లంఘన కింద అతడి మ్యాచ్‌ ఫీజులో 30 శాతం జరిమానా విధిస్తూ రిఫెరీ నిర్ణయం తీసుకొన్నాడు.

Updated Date - May 09 , 2024 | 05:08 AM