Share News

ముఖ్యమంత్రి సహాయ నిధికిఏపీజీవీబీ రూ.65 లక్షల విరాళం

ABN , Publish Date - Sep 18 , 2024 | 04:51 AM

వరద బాధితుల తోడ్పాటుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు (ఏపీజీవీబీ) ఉద్యోగులు రూ.65 లక్షలు విరాళంగా అందించారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికిఏపీజీవీబీ రూ.65 లక్షల విరాళం

హైదరాబాద్‌, సెప్టెంబరు 17: వరద బాధితుల తోడ్పాటుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు (ఏపీజీవీబీ) ఉద్యోగులు రూ.65 లక్షలు విరాళంగా అందించారు. మంగళవారం బ్యాంకు చైర్మన్‌ కే ప్రతాప్‌ రెడ్డి, ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మక్కడ్‌, కార్యదర్శి యశ్వంత్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఏపీజీవీబీ సిబ్బందికి ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Sep 18 , 2024 | 04:51 AM