Share News

Hyderabad: ఆవిర్భావ వేడుకల్లో ఆ దేశ ప్రధాని లక్సిన్‌

ABN , Publish Date - Jun 03 , 2024 | 03:57 AM

న్యూజిలాండ్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సిన్‌ పాల్గొన్నారు. తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ న్యూజిలాండ్‌(టీఏఎన్‌జడ్‌) ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు ఆదివారం ఆక్లాండ్‌ నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో లక్సిన్‌ మాట్లాడుతూ పదేళ్లలో రాష్ట్ర పురోగతిని కొనియాడారు. ‘

Hyderabad: ఆవిర్భావ వేడుకల్లో ఆ దేశ ప్రధాని లక్సిన్‌

  • న్యూజిలాండ్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాల్లో దూసుకుపోతోందని వ్యాఖ్య

  • ఆవిర్భావ వేడుకల్లో న్యూజిలాండ్‌ ప్రధాని

  • నేను తెలంగాణను సందర్శిస్తాను: లక్సిన్‌

  • న్యూజిలాండ్‌లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 2: న్యూజిలాండ్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సిన్‌ పాల్గొన్నారు. తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ న్యూజిలాండ్‌(టీఏఎన్‌జడ్‌) ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు ఆదివారం ఆక్లాండ్‌ నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో లక్సిన్‌ మాట్లాడుతూ పదేళ్లలో రాష్ట్ర పురోగతిని కొనియాడారు. ‘‘నేను ఎన్నోసార్లు భారత్‌కు వచ్చాను. భారతదేశ సంస్కృతి అంటే నాకు ఎంతో ఇష్టం. తెలంగాణ ఏర్పాటైన పదేళ్లలో ఐటీ, ఫార్మా రంగాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఇండియాకు వస్తాను. అధికారిక పర్యటనలో భాగంగా తెలంగాణను సందర్శిస్తాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. టీఏఎన్‌జడ్‌ అధ్యక్షుడు మల్గారి శైలేంద్రరెడ్డి మాట్లాడుతూ.. భారత్‌లోని ఒక రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఓ ప్రధాని రావడం ఇదే తొలిసారి అన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 03:57 AM