Share News

Farmer suicide: యువ రైతు ఉసురు తీసిన అప్పులు

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:58 AM

వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేననే బాధతో ఓ యువ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Farmer suicide: యువ రైతు ఉసురు తీసిన అప్పులు

నర్మెట, జూలై 18: వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేననే బాధతో ఓ యువ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా నర్మెట మండలంలోని కన్నెబోయినగూడెం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన తోడేటి సాంబరాజు(29) మూడున్నర ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. భూమి చదును చేయడం, బోర్లు వేయడం కోసం రూ. 10లక్షల వరకు అప్పులు చేశాడు. బాకీలు తీర్చలేననే బెంగతో ఈ నెల 16న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.

Updated Date - Jul 19 , 2024 | 05:58 AM