Share News

Electric Shock: విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం..

ABN , Publish Date - Sep 02 , 2024 | 05:00 AM

పొలంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు చనిపోయా డు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం లింగారెడ్డిగూడలో శనివారం రాత్రి జరిగింది.

Electric Shock: విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం..

  • రంగారెడ్డి జిల్లా లింగారెడ్డిగూడలో ఘటన

షాద్‌నగర్‌ రూరల్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పొలంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు చనిపోయా డు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం లింగారెడ్డిగూడలో శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన రైతు వట్టెల యాదయ్య(47) శనివారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తూ తోటి రైతు పొలం వద్ద పాలు తీసుకురావడానికి వెళ్లాడు. పాలు పోసుకునేందుకు అక్కడ ఉన్న గదిలో డబ్బా వెతుకుతుండగా వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు.

Updated Date - Sep 02 , 2024 | 05:00 AM