Share News

Bomb Blast.: మందు పాతర పేలి వ్యక్తి మృతి

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:36 PM

ములుగు జిల్లా: వాజేడు మండలంలో మందు పాతర పేలి వ్యక్తి మృతి చెందాడు. పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందు పాత్ర పేలి వ్యక్తి మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో చోటుచేసుకుంది.

Bomb Blast.: మందు పాతర పేలి వ్యక్తి మృతి

ములుగు జిల్లా: వాజేడు మండలంలో మందు పాతర పేలి (Bomb Blast) వ్యక్తి మృతి (Man died) చెందాడు. పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందు పాత్ర పేలి వ్యక్తి మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా (Mulugu Dist.) వాజేడు మండలం (Vajedu Mandalam)లో చోటుచేసుకుంది. వివరాలు.. వాజేడు మండలంలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన ఇల్లెందుల ఏసు(55) సోమవారం వంట చేరుకు నిమిత్తం కొంగాల అటవీ ప్రాంతంలోని గుట్టపైకి ఎక్కుతున్న క్రమంలో మావోయిస్టులు (Maoists) అమర్చిన మందు పాత్రపై కాలు వేయటంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. దీంతో యేసు గాల్లోకి లేచి కిందపడి తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.


ఏసుతో పాటు అతని కొడుకు రమేష్ మరో ముగ్గురు సైతం వంట చెరుకు కోసం వెళ్లారు. మిగిలిన నలుగురుకి ఎటువంటి గాయాలు కాలేదు గుట్ట దిగి కిందకి వచ్చి స్థానికులకు సమాచారం అందించడంతో స్థానికులు కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా పోలీసులు సంఘటన స్థలానికి ఇప్పటివరకు చేరుకోలేదు మృత మృతదేహాన్ని కిందకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు, స్థానికులు జంకుతున్నారు .మందు పాత్రలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బానిసత్వాన్ని తెలంగాణ భరించదు:సీఎం

మరో బాదుడు మొదలుపెట్టిన జగన్..

అతిపెద్ద పార్టీగా అవతరించనున్న టీడీపీ..

ప.గో. జిల్లాలో కూటమి పంజా విసరనుందా?

అధికారులకు సీఈసీ కీలక ఆదేశాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 03 , 2024 | 12:39 PM