అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ABN , Publish Date - May 08 , 2024 | 12:01 AM
ఎంపీపీ లకావత్ మానస
హుస్నాబాద్రూరల్, మే 7: గ్రామాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు పరిస్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీపీ లకావత్ మానస పేర్కొన్నారు. ఎంపీపీ మానస అధ్యక్షతన మంగళవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా ప్రత్యేకాధికారులు పనిచేయాలని సూచించారు. వ్యవసాయ రంగంలో రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నిర్మల, ఎంపీడీవో, తహసీల్దార్, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.