Share News

Gandhi Bhavan: రేపు గాంధీభవన్‌కు మంత్రి పొంగులేటి?

ABN , Publish Date - Sep 19 , 2024 | 04:51 AM

ఇకపై ప్రతి వారం.. బుధ, శుక్ర వారాల్లో ఎవరైనా ఒక మంత్రి.. గాంధీ భవన్‌లో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు.

Gandhi Bhavan: రేపు గాంధీభవన్‌కు మంత్రి పొంగులేటి?

  • వారంలో ఇద్దరు మంత్రుల రాక.. రేపటి నుంచే ప్రారంభం

  • బుధ, శుక్ర వారాల్లో ఒక్కొక్కరు వచ్చేలా షెడ్యూల్‌ రూపొందించండి

  • టీపీసీసీ అధ్యక్షుడి ఆదేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఇకపై ప్రతి వారం.. బుధ, శుక్ర వారాల్లో ఎవరైనా ఒక మంత్రి.. గాంధీ భవన్‌లో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. సదరు మంత్రి.. కార్యకర్తలు, నేతల నుంచి వినతులు స్వీకరించి, పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు. ఏ మంత్రి ఏ రోజున అందుబాటులో ఉండాలన్న అంశంపై షెడ్యూల్‌ రూపొందించాలని గాంధీభవన్‌ సిబ్బందికి టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గాంధీభవన్‌లో కార్యకర్తలు, నేతలకు మంత్రి అందుబాటులో ఉండే విధానం.. ఈ శుక్రవారం నుంచే ప్రారంభం కానుంది.


రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డితోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయంతో పాటు గాంధీభవన్‌ ప్రాధాన్యతను పెంచేందుకే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న రోజునే.. వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీభవన్‌కు రావాలని, నెలలో రెండు సార్లు సీఎం రేవంత్‌రెడ్డి కూడా రావాలని సభా ముఖంగా కోరారు.

Updated Date - Sep 19 , 2024 | 04:51 AM