Share News

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి తీవ్ర నిరాశ

ABN , Publish Date - May 14 , 2024 | 02:33 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఆశించిన బీఆర్ఎల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. నేటితో జుడీషియల్ కస్టడీ ముగిసినప్పటికీ మే 20 వ తేదీ వరకు పొడగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి తీవ్ర నిరాశ

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor scam Case) బెయిల్ ఆశించిన బీఆర్ఎల్సీ కవితకు (MLC Kavitha) మరోసారి నిరాశే ఎదురైంది. నేటితో జుడీషియల్ కస్టడీ ముగిసినప్పటికీ మే 20 వ తేదీ వరకు పొడగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం కీలక విచారణ జరిగింది. కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ పొడగించాలని కోర్టును ఈడీ కోరింది. 8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేశామని ఈడీ తెలిపింది. దీంతో జుడీషియల్ కస్టడీని పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై మే 20 న విచారణ జరుపుతామని రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది.


కాగా ఢిల్లీ మద్యం స్కామ్‌లో మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో (మంగళవారం) ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను అధికారులు కోర్టులో హాజరుపరిచారు.

ఇవి కూడా చదవండి...

Loksabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్

AP News.. పల్నాడు జిల్లా: నరసరావుపేటలో ఉద్రిక్తత

Read Telangana News And Telugu News

Updated Date - May 14 , 2024 | 02:43 PM