Share News

TG : అన్నారం బ్యారేజీలో అధ్యయనం పూర్తి

ABN , Publish Date - Aug 28 , 2024 | 06:05 AM

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని అన్నారం బ్యారేజీలో నీటి ప్రవాహంపై శాస్త్రవేత్తల మొదటి దశ అధ్యయనం మంగళవారం పూర్తయింది.

TG : అన్నారం బ్యారేజీలో అధ్యయనం పూర్తి

మహదేవపూర్‌, ఆగస్టు 27: భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని అన్నారం బ్యారేజీలో నీటి ప్రవాహంపై శాస్త్రవేత్తల మొదటి దశ అధ్యయనం మంగళవారం పూర్తయింది. ఎన్డీఎ్‌సఏ సూచించిన సిఫార్సుల మేరకు సెంట్రల్‌ వాటర్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ ఆధ్వర్యంలో బ్యారేజీలో పరీక్షలను ఇప్పటికే నిర్వహించగా మరికొన్ని చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో పుణెకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు బ్యారేజీ వద్ద ఆదివారం నుంచి ఏడీసీపీ ఆధునిక పద్ధతిలో పరికరాలను ఉపయోగిస్తూ నాటు పడవల్లో ప్రయాణిస్తూ పరిశీలన చేశారు. మొదటి దఫా అధ్యయనం మంగళవారం పూర్తి కాగా నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. మరోమారు అధ్యయనం చేయనున్నారు.

Updated Date - Aug 28 , 2024 | 06:05 AM