Share News

Uttam: చంద్రబాబును అభినందించిన ఉత్తమ్‌

ABN , Publish Date - Sep 13 , 2024 | 03:51 AM

నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబు నాయుడును తెలంగాణ జల వనరుల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అభినందించారు.

Uttam: చంద్రబాబును అభినందించిన ఉత్తమ్‌

  • వెలగపూడి సచివాలయంలో బాబుతో భేటీ

అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబు నాయుడును తెలంగాణ జల వనరుల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అభినందించారు. తన మిత్రుడి ఇంట జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు గురువారం విజయవాడకు వచ్చిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దంపతులు వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.


బాబుకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించడం పట్ల సంతోషంగా ఉందని ముఖ్యమంత్రితో ఉత్తమ్‌కుమార్‌రెడ్డ్డి అన్నారు. కాగా.. ఇరువురి మధ్య స్నేహపూర్వక పరస్పర అభినందనలు మినహా.. రాష్ట్రాల అంశాలు ప్రస్తావనకు రాలేదని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Sep 13 , 2024 | 03:51 AM