శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Oct 04 , 2024 | 09:26 PM

తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమైనాయి. అందులోభాగంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు.

తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమైనాయి. అందులోభాగంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ రోజు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు.


అంతకుముందు రేణుగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమలకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఈ రోజు రాత్రికి సీఎం చంద్రబాబు తిరుమలలోనే బస చేయనున్నారు. శనివారం సీఎం చంద్రబాబు అమరావతికి తిరిగి పయనమవ్వనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన సందర్భంగా జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Updated at - Oct 04 , 2024 | 09:27 PM