మోదీ ఓటమి ఖాయం: సీఎం రేవంత్ రెడ్డి

ABN, Publish Date - May 07 , 2024 | 09:56 AM

హైదరాబాద్: ‘బీజేపోళ్లు మోదీ గ్యారంటీ అని అంటున్నారు కానీ, మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది. మోదీ ఇంటికిపోతున్నాడు. బై బై మోదీ’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య భారత్‌లో ఉందని,..

హైదరాబాద్: ‘బీజేపోళ్లు మోదీ గ్యారంటీ అని అంటున్నారు కానీ, మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది. మోదీ ఇంటికిపోతున్నారు. బై బై మోదీ’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య భారత్‌లో ఉందని, 125 దేశాల్లో ఆకలి కేకల లెక్కలు తీస్తే భారత్‌ 111వ స్థానంలో నిలిచి చెడ్డ పేరు తెచ్చుకుందని, పక్కనే ఉన్న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ కంటే మన దేశంలోనే ఆకలి ఎక్కువ ఉందని సీఎం తెలిపారు. ఇదంతా పదేళ్ల మోదీ హయాంలో జరిగిందని, ఆయన పాలనలో ఉద్యోగాలు రాలేదని, రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని విమర్శించారు. అందుకే ఈసారి మోదీ ఓటమి ఖాయమన్నారు. సోమవారం గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అంబర్‌పేట, ఉప్పల్‌, కంటోన్మెంట్‌, పికెట్‌ చౌరస్తాలలో నిర్వహించిన కాంగ్రెస్‌ రోడ్‌షోలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

Updated at - May 07 , 2024 | 09:56 AM