ఏపీలో ఐప్యాక్ కార్యాలయం మూసివేత..!

ABN, Publish Date - May 21 , 2024 | 07:02 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తవడంతో వ్యూహకర్తల కాలం కూడా ముగిసింది. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ తరఫున రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వారు పెట్టే బేడా సర్దేశారు. ముఖ్యంగా వైసీపీ కోసం పనిచేసిన ఐప్యాక్ ఏపీ నుంచి ప్యాకప్ చెప్పేసింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తవడంతో వ్యూహకర్తల కాలం కూడా ముగిసింది. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ తరఫున రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వారు పెట్టే బేడా సర్దేశారు. ముఖ్యంగా వైసీపీ కోసం పనిచేసిన ఐప్యాక్ ఏపీ నుంచి ప్యాకప్ చెప్పేసింది. 5 వందల మంది ఉద్యోగులు వెళ్లిపోయారు. సీఎం జగన్ స్వయంగా ఆఫీసుకు వెళ్లి.. మీ సేవలు కొనసాగుతాయని చెప్పినా ఉద్యోగులు వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ఐప్యాక్ సంస్థ ఆఫీసును క్లోజ్ చేస్తోంది. ఉద్యోగులకు సెలవులు ఇచ్చి కంప్యూటర్లను షిప్ట్ చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఆ సంస్థ పని అయిపోయిందనే టాక్ నడుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సన్నాలకు బోనస్‌..

ఎవరికి ఎన్ని సీట్లో?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 21 , 2024 | 07:02 AM