కుప్పంలో చేరికలను వ్యతిరేకిస్తున్న టీడీపీ క్యాడర్‌

ABN, Publish Date - Jul 26 , 2024 | 08:45 AM

చిత్తూరు జిల్లా: కుప్పంలో పార్టీ మారేందుకు వైసీపీ నేతలు రెడీ అయ్యారా? తెలుగుదేశం గేట్లు తెరిస్తే ఒక్కసారిగా జంప్ అయ్యే ప్లాన్‌లోఉన్నారా? పార్టీ మారితే జరిగే నష్టాన్ని వైసీపీ నేతలు గుర్తించినా.. డ్యామేజ్ కంట్రోల్‌కు చర్యలు చేపట్టలేదా? ఒకరిద్దరు నేతలు చేస్తున్న బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించడం లేదా?

చిత్తూరు జిల్లా: కుప్పంలో పార్టీ మారేందుకు వైసీపీ నేతలు రెడీ అయ్యారా? తెలుగుదేశం గేట్లు తెరిస్తే ఒక్కసారిగా జంప్ అయ్యే ప్లాన్‌లోఉన్నారా? పార్టీ మారితే జరిగే నష్టాన్ని వైసీపీ నేతలు గుర్తించినా.. డ్యామేజ్ కంట్రోల్‌కు చర్యలు చేపట్టలేదా? ఒకరిద్దరు నేతలు చేస్తున్న బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించడం లేదా? ఓటమి షాక్ నుంచి తేరుకోని ఫ్యాన్ పార్టీ ఇన్చార్జ్.. తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను పట్టించుకోవాడం లేదా?..


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గంలో రాజకీయ పరిణామలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ఫలితాలకు ముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. గతంలో టీడీపీ నేతలను శత్రువులుగా చూసిన వైసీపీ నేతలు ఇప్పుడు అదే పార్టీలో చేరి మిత్రులుగా మారాలని చూస్తున్నారు. కానీ టీడీపీ శ్రేణులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఫ్యాన్ పార్టీ నేతలను చేర్చుకోవడానికి పార్టీ అధినేత చంద్రబాబుకు ఇష్టంలేదట. పార్టీ కేడర్ మనసు నొప్పించడానికి అంగీకరించడంలేదు. వైసీపీ నేతలను చేర్చుకునే విషయంలో గతంలో విముఖత చూపిన చంద్రబాబు.. ఇప్పుడు సుముఖంగా ఉన్నారట.


ఫ్యాన్ పార్టీ నేతలు చేరకుండా ముందుగా గేట్లు క్లోజ్ చేసినా.. పార్టీ పటిష్టత కోసం ఓపెన్ చేసుందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్.. చేరికలు అవసరమేనని అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ నేతల జాయినింగ్‌ను టీడీపీ అధిష్టానం అంగీకరిస్తే కుప్పంలో వైసీపీ ఖాళీ అయ్యే అవకాశముంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మా భూములు మాకు కావాలి.. తిరగబడ్డ జనం

యంగ్ స్టార్ కదా అని అవకాశమిస్తే..

పైశాచికానికి పరాకాష్ఠ

పోలవరం.. మూడేళ్లలో పూర్తి!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 26 , 2024 | 08:45 AM