ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వైసీపీ నేతలు
ABN, Publish Date - May 20 , 2024 | 09:45 AM
నెల్లూరు జిల్లా: మర్రిపాడు మండలం, కండ్రిగలో వైసీపీ భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములు యదేచ్ఛగా ఆక్రమించుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని వైసీపీ కబ్జాదారులు రాత్రికి రాత్రి చదును చేసి ఆక్రమించారు.
నెల్లూరు జిల్లా: మర్రిపాడు మండలం, కండ్రిగలో వైసీపీ భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములు యదేచ్ఛగా ఆక్రమించుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని వైసీపీ కబ్జాదారులు రాత్రికి రాత్రి చదును చేసి ఆక్రమించారు. ఈ ఆక్రమణలపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భూమిని కబ్జా చేయడమే కాకుండా అందులో జామాయిల్ మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. మండలంలో జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణలే లక్ష్యంగా వైసీపీ నేతలు ఈ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తూర్పు గోదావరి జిల్లాలో సైకిల్ హవా..
సిట్ దర్యాప్తులో అసలు వాస్తవాలు..!
జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే
చంద్రబాబుతో టచ్లోకి ఏపీ అధికారులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - May 20 , 2024 | 09:45 AM