Home » Ambati Rambabu
Andhrapradesh: ఏపీలో లా అండ్ ఆర్డర్ దారుణంగా పడిపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఒంటేరు నాగరాజు అనే వైసీపీ కార్యకర్తని కిడ్నాప్ చేశారన్నారు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన నాగరాజు ప్రాణభయంతో వినుకొండ వచ్చారని తెలిపారు. పోలీసు వ్యవస్థ పని చేస్తోందా? అని ప్రశ్నించారు. ఎస్పీతో కూడా మాట్లాడామని అన్నారు.
ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారినా.. ముద్రగడ ముద్రగడేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు సష్టం చేశారు. బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు.
అవును.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) నవ్వారు..! అది కూడా మామూలు నవ్వు కాదండోయ్ పగలబడి మరీ నవ్వారు..!
‘పల్నాడు జిల్లా సత్తెనపల్లి మెయిన్ రోడ్డు పక్కన జిల్లా పరిషత్కు రూ.30 కోట్లు విలువ చేసే 2.74 ఎకరాల భూమి ఉంది. దానిని కాజేసేందుకు అప్పటి మంత్రి అంబటి రాంబాబు చాలా ప్రయత్నం చేశాడు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కొత్త రాగం అందుకున్నారు. పోలీసులు పిన్నెల్లిని అదుపులోకి తీసుకోలేదని...
తనకు అర్థం కాలేదు కాబట్టి.. పోలవరం సబ్జెక్ట్ ఇంకెవరికీ అర్థం కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని తొలిసారిగా చెప్పిన గొప్పతనం కూడా తనదేనని గొప్పగా చెప్పుకొన్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబటికి చీర.. జాకెట్, పూలు ఇచ్చేందుకు తెలుగు విద్యార్థి నేతలు వెళ్లారు. సుకన్య, సంజనాలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వనం అందించేందుకు వెళ్లిన విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబుకు చుక్కెదురు అయ్యింది. తాను పోటీ చేసిన సత్తెనపల్లిలో రీ పోలింగ్ జరపాలనే పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రీ పోలింగ్ జరపడం ఏంటి అని ప్రశ్నించింది. మంత్రి అంబటి రాంబబు వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది.
పల్నాడు జిల్లాల్లో ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ జరిగిన రోజు, ఆ తర్వాత అల్లర్లు, అరాచకాలు జరుగుతున్నాయి. అయితే ఈ అల్లర్లలో పెద్దఎత్తున రిగ్గింగ్కు పాల్పడ్డారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు.
Andhrapradesh: పల్నాడులో హింసాత్మక ఘటనలపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు.