Home » Anna Canteen
Andhrapradesh: తణుకు అన్న క్యాంటీన్లో ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చేతులు కడిగే సింక్లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలే అని అన్నారు. విషప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్ ఈ పనిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలకు పట్టెడన్నం పెట్టి కడుపు నింపిన అన్న క్యాంటీన్లు తిరిగి పునఃప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భారీ ఎత్తున పేదలు, కూలీలు, భవన కార్మికులు బారులు తీరడంతో క్యాంటీన్ల పరిసరాలు కోలాహలంతో నిండిపోయాయి.
Andhrapradesh: తూర్పు నియోజకవర్గం పటమట హైస్కూల్ వద్ద అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ సృజన, మున్సిపల్ కమీషనర్ ధ్యానచంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. పేదల కడుపు నింపే లక్ష్యంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించారన్నారు.
Andhrapradesh: నెల్లూరు నగరంలోని చేపల మార్కెట్ వద్దా అన్నా క్యాంటిన్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. 2014 -19 మధ్య 203క్యాంటీన్లు ప్రభుత్వం మంజూరు చేసిందని... 173 క్యాంటీన్లు అప్పుడు ప్రారంభించామన్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చినట్టుగా ‘అన్న క్యాంటీన్లు’ పున:ప్రారంభమయ్యాయి. నిన్న (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు ఈ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో పునఃప్రారంభమైన అన్న క్యాంటీన్లకు విరాళాలందించే విషయంలో ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించే నిమిత్తం పారిశ్రామికవేత్తలు, సాధారణ ప్రజలు, వృద్ధులు సైతం తరలి వచ్చి విరాళాలిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘ అన్న క్యాంటీన్’ను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసి వేశాడని ఆయన మండిపడ్డారు.
పేదల జీవితాల్లో వెలుగులు నింపుతానని, పేదలకు కడుపునిండాఅన్నంపెడితే అదే మానసిక సంతృప్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలోని రామబ్రహ్మం పార్కులో అన్నక్యాంటీన్ను గురువారం ఆయన ప్రారంభించారు. సీఎం సతీమణి భువనేశ్వరి ప్రజలకు భోజనం వడ్డించారు.
అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విరాళాలు స్వీకరిస్తోంది. స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేవారికోసం ఎస్బిఐలో ప్రత్యేక ఖాతాను తెరిచింది.
ఐదేళ్ళ వైసీపీ పాలనలో సామాన్యుడు ఎన్నో కష్టాలు పడ్డాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. పేదవాడి ఆకలి తీర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.