Home » Cyber Crime
హైదరాబాద్లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు బాధితుడిని మోసం చేశారు.. బాధితుడి దగ్గరి నుంచి రూ.10.61 కోట్లను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. హైదరాబాద్కు చెందిన వృద్ధుడు(73) తనకు ఎలాంటి సంతానం లేకపోవడంతో డబ్బునంతా బ్యాంకులో జమ చేసుకున్నాడు.
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు మరో నిండు ప్రాణం బలైపోయింది. తన కూతురిని వ్యభిచారం కేసులో అరెస్టు చేసినట్టు ఫోన్ కాల్ రావడంతో హడలిపోయిన ఓ టీచర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆగ్రాలో వెలుగు చూసింది.
గూగుల్లో రేటింగ్ ఇస్తే డబ్బులు సంపాదించవ్చని నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరానికి చెందిన విద్యార్థి నుంచి రూ. 1.90 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన విద్యార్థిని (21)కు వాట్స్పలో ఓ సందేశం వచ్చింది. గూగుల్లో రేటింగ్ ఇస్తే డబ్బులు సంపాదించవచ్చని చెప్పడంతో ఆన్లైన్ గూగుల్ రేటింగ్ టాస్క్లో చేరింది.
మీ అడ్రస్ అప్డేట్ చేస్తే తపాలాశాఖ నుంచి వచ్చిన పార్సిల్ ఇంటికి చేర్చుతామని నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ. 2.43 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన మహిళకు 8210587741 నెంబర్ నుంచి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. కొత్త అడ్రస్ అప్డేట్(Update) చేస్తే పార్సిల్ను ఇంటికి చేర్చుతామంటూ వాట్స్పలో లింక్ పంపారు.
సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వీడియో కాల్ చేసి.. పోలీసుల్లా మాట్లాడుతూ.. అరెస్టు చేస్తాం అని బెదిరించి డబ్బులు దండుకునే గ్యాంగులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్ క్రైమ్కు ప్రధాన కారణంగా మారిన సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లపై దృష్టిపెట్టింది.
కార్డ్ క్లోనింగ్ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి సైబర్ నేరగాళ్లు(Cyber criminals) డబ్బు కాజేసిన సందర్భంలో బాధితుడికి వివరాలు అందించడంలో జాప్యం చేసిన బ్యాంకు తీరును వినియోగదారుల ఫోరం తప్పుబట్టింది. తిరుమలగిరికి చెందిన శామిర్ పటేల్కు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉంది.
ఇప్పటి వరకు ఫెడెక్స్, సీబీఐ, ఈడీ వంటి సంస్థల పేరుతో కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఇండియన్ పోస్టల్ సర్వీస్ పేరును కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మీ పార్సిల్ డెలివరీ చేసేందుకు లొకేషన్ షేర్ చేయమంటూ సందేశం పంపిన సైబర్ నేరగాళ్లు బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి రూ. 1.55 లక్షలు కాజేశారు. మీకు వచ్చిన పార్సిల్ కోసం డెలివరీ లొకేషన్ షేర్ చేయమని, లేకపోతే పార్సిల్ రిటర్న్ అవుతుందని నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఫోన్కు సందేశం వచ్చింది.
ఆర్థిక మోసాల బారిన పడ్డ వారు వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేయడంతో పాటు, పోలీసులు, జాతియ దర్యాప్తు సంస్థలకు తక్షణం కంప్లెయింట్ ఇస్తే పోయిన డబ్బు తిరిగొచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించి రూ. 5.27 కోట్లు మోసం చేసిన కేటుగాన్ని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్సబీ) పోలీసులు అరెస్టు చేశారు.