Home » Duvvada Family Controversy
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆడిన మరో డ్రామా బయటపడింది. దివ్వెల మాధురితో కలిసి ఆడిన ఆత్యహత్యాయత్నం నాటకం గుట్టురట్టయింది.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా పదో రోజుకు చేరుకుంది. ఇరు కుటుంబ సభ్యుల చర్చలు కొలిక్కి రాలేదు. దువ్వాడ వాణి రోజుకో కొత్త డిమాండ్ తీసుకొస్తున్నారు. దువ్వాడ శ్రీనుతో కలిసి ఉంటానని, అతను ఉంటోన్న ఇంట్లోనే ఉంటానని చెబుతున్నారు. వాణితో కలిసి ఉండేందుకు శ్రీనివాస్ అంగీకరించడం లేదు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామాలో పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఇంటి గొడవ రచ్చ కావడంతో దువ్వాడ శ్రీను సోదరుడు రంగంలోకి దిగి వాణితో చర్చలు జరిపారు. పెద్ద మనుషుల సమక్షంలో జరిపిన చర్చలు ఒకే ఒక్క డిమాండ్తో ఆగిపోయాయి. ఆ డిమాండ్ ఏంటంటే.. దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు గురించి చర్చ.. ఆ విషయంపై దువ్వాడ శ్రీను- దువ్వాడ వాణి గొడవ పడుతుంటే మధ్యలోకి రిటైర్డ్ టీచర్ చింతాడ పార్వతీశం వచ్చారు.
ఒకటా రెండా.. వారం రోజులుగా ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. దువ్వాడ.. దువ్వాడ.. దువ్వాడ.. ఇదే టాపిక్..! ఎందుకంటే.. ‘ఆయనకు ఇద్దరు’ ఎపిసోడ్లో గంటకో ట్విస్ట్.. ట్విస్ట్లు ట్విస్టులు.. లెక్కలేనన్ని వెలుగుచూశాయ్..! వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) ఫ్యామిలీ రచ్చలో సోమవారం నాడు కీలక పరిణామమే జరిగింది. రెండో ఇంటి రచ్చపై..