Home » Farooq Abdullah
జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నతంకాలం తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని గతంలో ప్రకటించిన మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తన నిర్ణయం మార్చుకున్నారు.
జమ్మూ కశ్మీర్లో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. పార్టీల మధ్య పొత్తులు ఖరారయ్యాయి. జమ్మూకశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి) ఒకటయ్యాయి. పొత్తు కుదిరినా సీట్ల పంచాయతీ ఇంకా తెగలేదు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. 90 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఫరూక్ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు అవగాహన కుదిరింది.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీఐ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల్లో పోటీపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పష్టత ఇచ్చారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
పీఓకేను భారత్లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) ఆదివారం స్పందించారు. పీఓకేను భారత్లో కలపాలని చూస్తే పాకిస్థాన్ గాజులు తొడుక్కుంటూ కూర్చోదని భారత్కు వార్నింగ్ ఇచ్చారు.
ముస్లింలు ఎవరి హక్కులను ఊడలాక్కోరని, ఇతర మాతాలను గౌరవించాలని తమకు అల్లా చెప్పారని జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నారు. మతం పేరుతో దేశాన్ని విడగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని తప్పుపట్టారు.
'ఇండియా' కూటమిని, కూటమి అభ్యర్థులను చూసి బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. జమ్మూకశ్మీర్కు రాష్ట్ర ప్రతిపత్రిని ప్రధానమంత్రి ఇప్పుడెందుకు ఇవ్వలేదని నిలదీశారు.
INDIA Alliance: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి ఆదిలోనే వరుస ఎదురుదెబ్బలకు తగులుతున్నాయి. అసలు ఈ కూటమి ఉంటుందా? ఊడుతుందా? అన్న పరిస్థితి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్లో జయంత్ చౌదరి.. పంజాబ్లో భగవంత్ మాన్.. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా.. ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చారు.
విచారణకు హాజరు కావాలంటూ ఈడీ పంపిన నోటీసును జమ్మూ- కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తిరస్కరించారు. విచారణకు హాజరు కాలేనని తెలిపారు.
మనీలాండరింగ్ కేసులో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకుఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజా సమన్లు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన పాత కేసులో శ్రీనగర్లోని ఈడీ కార్యాలయం ముందు మంగళవారంనాడు హాజరుకావాలని కోరింది.