Home » Human Trafficking
మద్యంమత్తులో తండ్రే కూతుర్ని విక్రయించిన ఘటన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం(Nuguru Venkatapuram)లో చోటు చేసుకుంది. తాగిన మైకంలో కన్న తండ్రే ఓ చిన్నారిని అమ్మిన ఘటన హృదయాల్ని కలచివేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో పిల్లలను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విక్రయిస్తున్న ముఠా అరెస్టు సంచలనంగా మారింది. 13మంది చిన్నారులను కాపాడి 11మంది నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.
కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువతను కాపాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. మానవ అక్రమ రవాణాకు ఏపీ కేంద్రంగా మారడం ఆందోళనకరమని ఆయన ఎక్స్(ట్విటర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 150మందిని స్వదేశానికి తీసుకొచ్చేలా సహాయపడాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు విజ్ఞప్తి చేశారు.