Share News

Crime News: దారుణం.. మద్యంమత్తులో కుమార్తెను విక్రయించిన తండ్రి..

ABN , Publish Date - Aug 07 , 2024 | 07:59 AM

మద్యంమత్తులో తండ్రే కూతుర్ని విక్రయించిన ఘటన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం(Nuguru Venkatapuram)లో చోటు చేసుకుంది. తాగిన మైకంలో కన్న తండ్రే ఓ చిన్నారిని అమ్మిన ఘటన హృదయాల్ని కలచివేస్తోంది.

Crime News: దారుణం.. మద్యంమత్తులో కుమార్తెను విక్రయించిన తండ్రి..

ములుగు: మద్యంమత్తులో తండ్రే కూతుర్ని విక్రయించిన ఘటన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం(Nuguru Venkatapuram)లో చోటు చేసుకుంది. తాగిన మైకంలో కన్న తండ్రే ఓ చిన్నారిని అమ్మిన ఘటన హృదయాల్ని కలచివేస్తోంది. నూగురు వెంకటాపురం గ్రామానికి చెందిన జంపయ్య, లక్ష్మీ దంపతులకు ఇటీవల ఓ పాప జన్మించింది. అయితే ఏటూరు నాగారం మండలం రామన్నగూడెంకు చెందిన సుధాకర్ అనే వ్యక్తికి నవజాత శిశువును విక్రయించేందుకు కన్న తండ్రే బేరం పెట్టాడు.


భార్యకు తెలియకుండా పాపను తీసుకెళ్లి రూ.15వేలు, పాత ద్విచక్రవాహనం తీసుకుని చిన్నారిని అమ్మేశాడు. అయితే పాప చనిపోయిందని తానే స్వయంగా ఖననం చేశానని చెప్పి భార్య, బంధువులను నమ్మించే ప్రయత్నం చేశాడు. జంపయ్య మనస్తత్వం తెలిసిన కుటుంబసభ్యులు, బంధువులు గట్టిగా నిలదీశారు. దీంతో పాపను అమ్మేసినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో నివ్వేరపోయిన వారంతా జంపయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 07 , 2024 | 07:59 AM