Home » ISRO
ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఐఐటీ మద్రాస్ నుండి పీహెచ్డీ డిగ్రీ స్వీకరించారు. శుక్రవారం జరిగిన ఐఐటీ మద్రాస్ 61వ స్నాతకోత్సవంలో ఆయన ఈ పట్టాను అందుకున్నారు.
రామసేతుకు(Ram Setu) సంబంధించిన రహస్యాలను ఛేదించడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మరో మైలురాయి చేరుకుంది. NASA ఉపగ్రహం సహాయంతో మొదటిసారిగా ఆడమ్ బ్రిడ్జ్ అని పిలిచే రామసేతు మ్యాప్ను ఆదివారం విడుదల చేసింది.
రాష్ట్రంలో అంతరిక్ష సంబంధిత పరిశ్రమలు నెలకొల్పే సంస్థలకు ప్రభుత్వం కల్పించనున్న సదుపాయాలు, రాయితీలకు సంబంధించిన నూతన అంతరిక్ష విధానాన్ని టిడ్కో విడుదల చేసింది. రాష్ట్రంలో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ఆధ్వర్యంలో కులశేఖరపట్టినం(Kulasekharapattinam) వద్ద రెండో రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
అంతరిక్ష వ్యర్థాల నియంత్రణలో భాగంగా ఒకసారి ప్రయోగించిన రాకెట్ను తిరిగి భూమి మీదికి తీసుకొచ్చే ప్రక్రియలో ‘హ్యాట్రిక్’ విజయాన్ని సాధించినట్టు ఇస్రో వెల్లడించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో అడుగు ముందుకేసింది. రీ-యూజబుల్ లాంఛ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పరిమెంట్ సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగాన్ని మూడోసారి విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మేరకు ఇస్రో ఓ ప్రకటన విడుదల చేసింది.
సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య-ఎల్1లోని రెండు పరికరాలు ఉగ్ర సూరీడు చిత్రాలను బంధించాయని ఇస్రో తెలిపింది. భారత తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ను ఇస్రో గతేడాది సెప్టెంబరు 2న ప్రయోగించింది.
నాలుగు విఫలయత్నాల అనంతరం ఎట్టకేలకు అగ్నికుల్ కాస్మో్సకు చెందిన ప్రైవేటు రాకెట్ ‘అగ్నిబాణ్’ నింగిలోకి ఎగిరింది. చెన్నైకి చెందిన స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ సంస్థ అగ్నిబాణ్ పేరిట తొలిసారిగా రూపొందించిన రాకెట్ ప్రయోగాన్ని గురువారం విజయవంతంగా నిర్వహించింది.
నానాటికీ ఆలయాలకు(Temples) వచ్చే యువత సంఖ్య తగ్గిపోతోందని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్(Somanath) ఆవేదన వ్యక్తం చేశారు. తిరువనంతపురంలోని శ్రీ ఉదియనూర్ దేవీ ఆలయంలో ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నయ్యర్ చేతుల మీదుగా ఆయన శనివారం ఓ అవార్డు అందుకున్నారు.
తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణం(Kulasekhara town)లో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటుకానున్న చోట 1,500 ఎకరాల్లో ‘స్పేస్ పార్క్’ నిర్మాణం కానుంది. ఇందుకోసం ఇస్రోతో తమిళనాడు ప్రభుత్వ నిర్వహణలోని ‘టిడ్కో’ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈమధ్య కాలంలో భారత్ పట్ల పాకిస్తాన్ స్వరంలో చాలా మార్పు వచ్చింది. గతంలో ఎల్లప్పుడూ విషం చిమ్మే ఆ దేశం.. ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా.. చంద్రయాన్-3 ప్రాజెక్ట్..