Home » Jupally Krishna Rao
మాదకద్రవ్యాలకు బానిసైతే ఉజ్వల భవిష్యత్తు అంధకారమవుతుందని, యువత వ్యసనాలను వీడి లక్ష్యం వైపు అడుగులేసి ఉన్నత స్థాయికి చేరుకుని భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.
చెంచు మహిళను వివస్త్రను చేసి ఆమెపై పాశవికంగా దాడి చేసిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మహిళపై జరిగిన దాష్టీకాన్ని హేయమైన ఆటవిక చర్యగా అభివర్ణించారు.
హిమాయత్ నగర్ పర్యాటక భవన్(Tourism Bhawan)ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆకస్మిక తనిఖీ చేశారు. హాజరు పట్టిక, బయోమెట్రిక్ అటెండెన్స్ పరిశీలించి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.
తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) అన్నారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని, సొంత నిర్ణయాలు తగవని అధికారులను హెచ్చరించారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రె్సలో చేరనున్నట్లు తెలుస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావుకు సన్నిహితుడిగా పేరుండడం, ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయన నుంచి ఒత్తిడి వస్తుండటం, కింది స్థాయి కార్యకర్తలు కూడా కాంగ్రె్సలోకి వెళ్దామని చెబుతుండడంతో ఆయన కూడా దాదాపుగా ఓకే అన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణను డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రంగా తీర్చిదిద్దుతామని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం హబ్గా మార్చాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసి అమలుకు ఏర్పాట్లు చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
రాష్ట్రంలోని బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సారథ్యంలో బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్గా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) తెలిపారు. టూరిజం ప్రమోషన్లో భాగంగా నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని మంత్రి జూపల్లి శనివారం సందర్శించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకుంది. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నాగరకుంట నవీన్కుమార్రెడ్డి 109 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్రెడ్డిపై గెలుపొందారు.
లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ (Congress) గెలువ బోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ దశాబ్ది వేడుకల శుభాకాంక్షలు తెలిపారు.