Home » Justice Chandrachud
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్(DY Chandrachud) అభయ హత్యాచార ఘటనపై సోమవారం విచారించారు. ఈ క్రమంలో గట్టిగా వాదించిన ఓ లాయర్పై అసహనం వ్యక్తం చేశారు.
కక్షిదారులకు సత్వర న్యాయం అందాలంటే కోర్టుల్లోని ‘వాయిదాల సంస్కృతి’ని మార్చాల్సి ఉందని ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు.
మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వరమే న్యాయం అందాల్సి ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. అలా అయితేనే భద్రతపై వారికి మరింత భరోసా ఇచ్చినట్టవుతుందని అన్నారు.
ఎస్సీ వర్గీకరణపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలయింది.
సోషల్ మీడియాను(Social Media) ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకున్న వారు ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేశారు.
జూనియర్ వైద్యురాలిపై ఘోర అత్యాచారం ఘటనకు సంబంధించి నేరం చేసింది తానేనని ఒప్పుకొని.. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ‘కావాలంటే నన్ను ఉరి తీసుకోండి’ (అమీ ఫాసీ దీయే దీ) అని పోలీసుల విచారణలో చెప్పిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఇప్పుడు మాటమార్చేశాడు.
కోల్ కతా వైద్యురాలి మృతి కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పనిచేసే చోట మహిళలు ఎదుర్కొంటోన్న వేధింపులపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మానం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవస్థలో లైంగిక హింస మూలాలు ఉన్నాయని పేర్కొంది. ఇందుకు అరుణా షాన్బాగ్ కేసు ఉదహరణ అని పేర్కొంది.
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద దెబ్బ తగిలింది. చట్టం ప్రకారం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ)లో సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కే ఉందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది.
కోర్టు వ్యవహారాలతో ప్రజలు విసిగిపోయారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. వారు కేవలం సమస్యలకు ఏదో విధమైన సత్వర పరిష్కారం కావాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.
షెడ్యూల్డు కులాల్లో ఉప కులాలను వర్గీకరించి రిజర్వేషన్ ఫలాలు వారికి అందజేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఓబీసీ ఉప కులాలకు వర్గీకరణ మాటేమిటన్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.