Home » KKR
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచింది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ చక్కని ప్రతిభ కనబరిచి టైటిల్ దక్కించుకుంది. టైటిల్ విన్నర్గా నిలిచినందుకు గానూ కేకేఆర్ టీమ్కు దక్కిన ప్రైజ్మనీ రూ.20 కోట్లు అట.
టీ 20 వరల్డ్ కప్ ముగిసింది. భారత్ విశ్వ విజేతగా నిలిచింది. భారత జట్టును ముందుండి నడిపింది కోచ్ రాహుల్ ద్రావిడ్. 17 ఏళ్ల తర్వాత భారత్కు ప్రపంచ కప్ను అందించారు. వరల్డ్ కప్ తర్వాత కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని ముందే ద్రావిడ్ ప్రకటించారు. కప్పు గెలిచి ద్రావిడ్కు గిప్ట్ అందించాలని టీమ్ మెంబర్స్ భావించి, అందజేశారు కూడా. నెక్ట్స్ టీమ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైంది. మరి రాహుల్ ద్రావిడ్ ఏం చేస్తారు.
వెస్టిండీస్ క్రికెట్ ఆటగాళ్లు ఎల్లప్పుడూ హుషారుగా, సరదాగా ఉంటారు. మైదానంలో తమ విచిత్రమైన చర్యలతో వినోదాన్ని పంచుతుంటారు. అప్పుడప్పుడు స్టెప్పులు వేస్తూ..
ఐపీఎల్-2024 సీజన్ విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ నిలిచింది. సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణించిన కేకేఆర్ సునాయాసంగా టైటిల్ చేజిక్కించుకుంది. కేకేఆర్ టీమ్ టైటిల్ సాధించడం వెనుక ఆ టీమ్ మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. జట్టుతో పూర్తిగా మమేకమై సమర్థవంతంగా పని చేశాడు.
చెన్నై చిదంబరం స్టేడియంలో ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుండడంతో బెట్టింగ్ ఊపందుకుంది. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన బుకీలు హైదరాబాద్ చేరుకున్నారు. హోటళ్లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆప్స్ బెర్త్ కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన లీగ్ మ్యాచ్లో పంజాబ్పై సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ 21వ తేదీ మంగళవారం రోజున అహ్మదాబాద్లో గల నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
చివరి బంతి వరకు ఉత్కంఠ నెలకొంది. ఒక పరుగు తేడాతో కోల్ కతా జట్టు విజయం సాధించింది. లాస్ట్ వరకు నువ్వా నేనా అన్నట్టు ఆర్సీబీ వర్సెస్ కోల్ కతా మ్యాచ్ సాగింది. చివరలో దినేష్ కార్తీక్ ఔటవ్వడంతో ఓటమి ఖాయం అని ఆర్సీబీ అభిమానులు భావించారు. కరణ్ శర్మ రూపంలో ఆపద్బాంధవుడు దొరికాడు అనిపించింది. అతను చెలరేగి ఆడటంతో మ్యాచ్ గెలిపిస్తాడని భావించారు. స్టార్క్కు స్ట్రెయిట్ క్యాచ్ ఇచ్చి కరణ్ శర్మ ఔటవ్వంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
అంపైర్లపై విరాట్ కోహ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్తో ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోహ్లి తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్షిత్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఆర్సీబీ తరఫున కోహ్లి రివ్యూ తీసుకున్నాడు. అయినప్పటికీ కోహ్లి ఔట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు.
ఐపీఎల్లో పరుగుల వరద పారుతోంది. ఏ జట్టు అయినా సరే కనీసం 200 పరుగులు చేస్తోంది. ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య 36వ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది.
విశాఖలో జరుగుతోన్న మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ గెలిచి కోల్ కతా బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను చీల్చి చెండాడారు. సునీల్ నరైన్ విధ్వంసకర ఇన్సింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 85 పరుగులు చేశాడు.