Home » Mancherial district
రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం పోరాడిన వీరుల త్యాగం చిరస్మరణీయమని, నాటి పోరాటాల ఫలి తంగా ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని, వీరయోధుల ను స్మరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ పేర్కొన్నారు. మంగళవారం ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జెండాను ఆవిష్క రించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మహాలక్ష్మి పథకం ఎల్పీజీ సబ్సిడీ పత్రాల పంపిణీలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అ ర్హులైన వారికి రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామన్నారు.
ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉపాధి హామీ పథకం 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను మంగళవారం నిర్వహించారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు రూ. 6.49 కోట్లతో జరిగిన వివిధ పనులపై బృందాలు తనిఖీలు నిర్వహించారు.
ప్రభుత్వం ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు తలపెట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అద నపు కలెక్టర్ మోతిలాల్తో కలిసి సమావేశం నిర్వహిం చారు.
సచివాలయం ఎదుట మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ మంగళ వారం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తంచేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన ప్రాంతంలో రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పా టు సరైంది కాదన్నారు.
నాగ్పూర్-సికింద్రాబాద్ మధ్య నూతనంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్లు రోజురోజుకూ పెరుగుతోంది. ఈ రైలు మంగళవారం మినహా రోజూ నడువనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వందేభారత్ రైలు సేవలు విశాఖ ప ట్నం-సికింద్రాబాద్, కాచిగూడ-తిరుపతి మధ్య నడుస్తున్నాయి.
గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు రామగండం సీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమ వారం మంచిర్యాల, లక్షెట్టిపేట పలు ప్రాంతాల్లో నిమజ్జనం, శోభాయాత్ర నిర్వ హించే ప్రదేశాలను పరిశీలించారు.
సికింద్రాబాద్ నుంచి నాగపూర్ నడిచే వందేభారత్ రైలును మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలని రైల్వే స్టేషన్లో చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు ఆందోళన చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వారికి మద్దతు తెలిపారు. చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు గుండా సుధాకర్, ఇరుకుళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ మం చిర్యాల రైల్వే స్టేషన్ ఏ గ్రేడ్ అయినప్పటికి ఇక్కడ ప్రధాన రైళ్లు నిలపక పోవడంతో వ్యాపారస్తులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోందని కలెక్టర్ కుమార్దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. సోమవారం వెల్గనూర్ గ్రా మాన్ని సోలార్ విద్యుత్ ఉత్పత్తి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా విద్యుత్ శాఖ అధికారులతో కలిసి సం దర్శించారు.
మండల కేంద్రంలో ఉన్న గొల్లవాగు ప్రాజెక్టు పర్యా టకులను ఆకర్షిస్తుంది. మండల కేంద్రం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో గొల్లవాగు ప్రాజెక్టును 18 సంవత్సరాల క్రితం నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణంతో జల వనరులు పెరిగి వ్యవసాయ మండ లంగా పేరుగాంచింది. వర్షాకాలంలో సం దర్శకుల తాకిడితో గొల్లవాగు ప్రాజెక్టు నిత్యం ప్రజలతో కళకళాడుతుంది.