Home » Medical News
వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి సూచించారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వరదల కారణంగా నీరు నిల్వ ఉండడం వల్ల పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించారు.
జూనియర్ డాక్టర్లపై పనిభారం పెరుగుతోందని, వారి పనివేళలు వారంలో 72 గంటల నుంచి 48 గంటలకు తగ్గించాలని కేంద్ర ఆర్యోగ కమిటీ సభ్యుడు డాక్టర్ కిరణ్ మాదాల కేంద్రాన్ని కోరారు.
వైద్య విద్య ప్రవేశాలు ప్రారంభమై.. అఖిల భారత కోటా రెండు విడతల కౌన్సెలింగ్ సైతం ముగిసిన తరుణంలో రాష్ట్రంలోని మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు డీమ్డ్ (స్వతంత్ర) యూనివర్సిటీ హోదా కల్పించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).
సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్కు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించిన విషయం తెలిసిందే. అంత్యక్రియల అనంతరం ఎయిమ్స్లోని అనాటమీ విభాగానికి శరీరాన్ని అప్పగించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా క్లినిక్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 23 బోధనాస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనుంది.
కాసిన్ని కాసులకు కక్కుర్తి పడి పీలేరు పట్టణంలో గర్భస్థ లింగ నిర్ధారణ చేస్తున్న ఓ స్కానింగ్ సెంటర్ను పీసీపీఎన్డీటీ (గర్భస్థ శిశు లింగనిర్ధారణ నిషేధ చట్టం) అధికారులు శుక్రవారం సీజ్ చేశారు.
దేశ, విదేశాల్లో పేద ప్రజలకు విద్య, వైద్య సేవలు అందిస్తున్న సత్యసాయి సేవ సంస్థ తెలంగాణలో తన సేవలను మరింత విస్తరిస్తోంది.
వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
చిన్నమ్మ అనే మహిళ 14 సంవత్సరాలుగా స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. ఏడాది పాటు కడప రిమ్స్లో సైతం పనిచేశారు. ఈమెకు డాక్టర్ చిన్నిక్రిష్ణ మాయమాటలు చెప్పి వివాహం చేసుకుని కాపురం చేసి కొంతకాలం తర్వాత పట్టించుకోవడం మానేశాడు.
రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి.