Home » Meghalaya
మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారా. అయితే ఈ లాటరీ గురించి తెలుకోండి మరి. ఎందుకంటే ఈ లాటరీ ద్వారా ఏకంగా రూ.50 కోట్లను గెల్చుకునే ఛాన్స్ ఉంది. అయితే దీనిని మొదటిసారిగా డిజిటల్ విధానంలో ప్రారంభించడం విశేషం.
కొందరికి మానవత్వ ఉండదు. మంచి, చెడులు అస్సలు లెక్క చేయరు. తప్పు చేసిందంటే చాలు దారుణంగా కొట్టేందుకు సైతం వెనకాడరు. మేఘలాయలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని గొడ్డును బాదినట్టు బాదారు.
బంగాళఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్(Remal Cyclone) కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.
ఇటివల బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో సంభవించిన రెమాల్ తుపాను(Remal Cyclone) ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విధ్వంసం సృష్టించింది. దీంతో తుపాను కారణంగా ఐజ్వాల్ జిల్లాలో 27 మంది మరణించారని మిజోరాం(Mizoram) ప్రభుత్వం తెలిపింది. అయితే వర్షాల తర్వాత పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో వీరంతా మృత్యువాత చెందినట్లు వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర తుపాన్గా మారినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రసుత్తం ఉత్తర దిశగా కదులుతూ.. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ వద్ద రెమల్ తుపాన్ ఈరోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 100నుంచి 135కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు.
ఇజ్రాయెల్ - గాజాల(Israel - Gaza) మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో దేశ పౌరుల లెక్కలు తీసే పనిలో పడింది. ఈ క్రమంలో మేఘాలయ(Meghalaya) ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన 27 మంది ఇజ్రాయెల్లో చిక్కుకుపోయినట్లు కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. వారిని సురక్షితంగా భారత్ తిరిగి రప్పించేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖని కోరింది. వారంతా ఇజ్రాయెల్కు తీర్థ యాత్ర కోసం వెళ్లారని ఇంతలో ముప్పు ముంచుకొచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది
సోమవారం సాయంత్రం మేఘాలయలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదైనట్టు తేలింది. దీంతో.. అస్సాం, ఈశాన్య ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. అయితే.. ప్రాణనష్టం, ఆస్తినష్టాలపై...
భారతీయ జనతా పార్టీ (BJP) నాగాలాండ్, మేఘాలయ, పుదిచ్చేరికి కొత్త అధ్యక్షులను నియమించింది. నాగాలాండ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బెంజమిన్ యేప్థోమి, మోఘాలయ రాష్ట్ర అధ్యక్షుడిగా రిక్మన్ మొమిన్లను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత ఏడాది చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో అదే ఉత్సాహంతో భారత్ జోడో యాత్ర ఫేజ్-2కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ యాత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి ప్రారంభమై మేఘాలయతో ముగియనుంది.
ఉమ్మడి పౌర స్మృతి ఆలోచనతో మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు కాన్రాడ్ కె.సంగ్మా విభేదించారు. భారతదేశ వాస్తవ ఆలోచనకు యూసీసీ విరుద్ధమని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశ ఆలోచనా విధానానికి ఉమ్మడి పౌర స్మృతి ఎంతమాత్రం తగదని అన్నారు.