BJP: రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త చీఫ్‌లు

ABN , First Publish Date - 2023-09-25T16:23:45+05:30 IST

భారతీయ జనతా పార్టీ (BJP) నాగాలాండ్, మేఘాలయ, పుదిచ్చేరికి కొత్త అధ్యక్షులను నియమించింది. నాగాలాండ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బెంజమిన్ యేప్‌థోమి, మోఘాలయ రాష్ట్ర అధ్యక్షుడిగా రిక్మన్ మొమిన్‌లను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.

BJP: రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త చీఫ్‌లు

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) నాగాలాండ్ (Nagaland), మేఘాలయ (Meghalaya), పుదిచ్చేరి (Puducherry)కి కొత్త అధ్యక్షులను నియమించింది. నాగాలాండ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బెంజమిన్ యేప్‌థోమి (Benjamin Yepthomi), మోఘాలయ రాష్ట్ర అధ్యక్షుడిగా రిక్మన్ మొమిన్‌లను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. పాండిచ్చేరి బీజేపీ అధ్యక్షుడిగా ఎస్.సెల్వగణపతిని నియమించారు. ఈ నియామకాలు తక్షణం అమల్లోకి వస్తాయని పార్టీ ప్రకటన తెలిపింది.

Updated Date - 2023-09-25T16:23:45+05:30 IST