Home » National News
దేశంలో కొత్త, పాత పార్లమెంట్ భవనాల(Parliament Buildings) సెక్యూరిటీ బాధ్యతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)కు అప్పగించారు. ఈ క్రమంలో మే 20వ తేదీ నుంచి 3 వేల 300 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని పార్లమెంట్ భద్రతకు వినియోగించనున్నారు.
పోర్షే లగ్జరీ కారు(Porsche car)లో వేగంగా వస్తున్న వ్యక్తి ఆకస్మాత్తుగా వచ్చి ఓ బైక్ను బలంగా ఢీకొట్టాడు(accident). దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణె(pune)లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఖరీఫ్ సీజన్లో భారతదేశంలోని రైతులతోపాటు సాధారణ ప్రజలకు కూడా గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఈ సీజన్లో వర్షాలు(rains) సాధారణం కంటే ఎక్కువగానే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) నికోబార్ దీవులకు చేరుకున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
వారు అమ్మేది చెప్పులు.. కానీ, వారి వద్ద ఉన్న సంపద కోట్లు.. అవును, వారి వద్ద ఉన్న నోట్ల కట్టలు చూసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఖంగుతిన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ. 40 కోట్ల నగదు పట్టుబడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముందుడి బీజేపీని నడిపిస్తోందనే అభిప్రాయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
లోక్సభకు ఇంతవరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో 'ఇండియా' కూటమి ఆధిక్యంలో ఉందని, మొత్తంగా 273కు పైగా సీట్లను తము కూటమి గెలుచుకోవడం ఖాయమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలపై నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల చేసిన వాఖ్యాలపై బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ విరుచుకుపడ్డారు. లాలూ పాకిస్థాన్కు వెళ్లిపోయి అక్కడ రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చన్నారు.
భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని, దేశాన్ని నియంతృత్వం దిశగా నడిపిస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. 'ఆప్'ను లేకుండా చేయాలని బీజేపీ కంకణం కట్టుకున్నందునే తమ నేతలనందరినీ జైలుకు పంపాలనుకుంటోందని అన్నారు.
కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు మనపై ఏది చేయాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాడని అన్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. విపక్ష 'ఇండియా'కి ఓటు వేసి గెలిపిస్తే రామాలయంపై బుల్డోజర్ నడిపిస్తుందంటూ పదేపదే ప్రధాని చేస్తున్న వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.