Home » National News
దేశంలో జనాభా అపరిమితంగా పెరిగిపోవడంతో 40-50 ఏళ్ల క్రితం దాని నియంత్రణకు కేంద్ర, రాష్ట్రాలు నడుం బిగించాయి. జనాభా నియంత్రణ విధానాలు గట్టిగా అమలు చేశాయి.
కొద్ది రోజులుగా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు వస్తున్న వరుస బాంబు బెదిరింపులు అటు విమానయాన సంస్థలు, కేంద్ర ప్రభుత్వం ఇటు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
పారిశ్రామిక ఆల్కహాల్ తయారీ, సరఫరాలపై నియంత్రణ అధికారం రాష్ట్రాలదేనని (శాసన సభలదేనని) సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
ఉగ్రవాదం అనే సవాలును ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరికి తావు లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అందరూ ఏకతాటిపై నిలిచి, పరస్పరం పటిష్ఠ మద్దతుతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.
'మహా వికాస్ అఘాడి' కూటమి మధ్య సీట్ల పంపకాల్లో భాగంగా కాంగ్రెస్, శివసేన (యూబీటీ), శరద్పవార్ ఎన్సీపీ సమానంగా 85-85-85 సీట్లకు ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. 288 మంది సభ్యుల అసెంబ్లీకి నవంబర్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ప్రియాంక గాంధీ ఉన్న ఆస్తుల్లో రూ.4.25 కోట్ల చరాస్తులు ఉన్నాయి. వాటిలో మూడు బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్లు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు, పీపీఎఫ్, రాబర్డ్ వాద్రా గిఫ్ట్గా ఇచ్చిన హోండా సీఆర్వీ కారు, రూ.1.15 కోట్లు విలువచేసే 4400 గ్రాములకు పైగా బంగారం ఉన్నాయి.
కమిటీ ప్రొసీడింగ్స్ గురించి కానీ, చర్చించిన అంశాల గురించి తాను బయటకు వెల్లడించడం లేదని, కమిటీ సమావేశంలో ఒక సభ్యుడు హింసాత్మక చర్చలకు పాల్పడటం, అందుకు ఆయనను సస్పెండ్ చేయడం గురించే తాను స్టేట్మెంట్ ఇచ్చానని జగదాంబికా పాల్ వివరణ ఇచ్చారు. పార్లమెంటరీ నిబంధనలు, సభా గౌరవం పట్ల తనకు విశ్వాసం ఉందన్నారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహా వికాస్ అఘాడీలోని మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్దవ్ ఠాక్రే) నేతలు బుధవారం ముంబయిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటు అంశంపై జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఈ మూడు పార్టీలు చెరి సమానంగా సీట్ల పంచుకోనున్నాయి. మిగిలిన స్థానాలను మిగతా మిత్ర పక్షాలకు కేటాయించాలని నిర్ణయించాయి.
రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగినంత కాలం జమ్మూకశ్మీర్ ప్రజలు బాధితులుగానే మిగిలిపోతారని, తాను మాత్రమే కాకుండా జమ్మూకశ్మీర్లోని ప్రతి ఒక్కరూ ఈ యుద్ధానికి తెరపడాలని కోరుకుంటున్నారని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు.
బిహార్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన కేవలం కొన్ని గంటల్లోనే రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఎత్తివేస్తామని జనసూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహా కర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే ప్రకటించిన విషయం విధితమే.