Home » National News
కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం కొత్త భవనం కేటాయించింది. సునేహ్రి బాగ్ రోడ్లోన బంగ్లా నెంబర్-5ను ఆయనకు హౌస్ కమిటీ ఆఫర్ చేసింది.
అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సామాజిక మాధ్యమ 'ఎక్స్'లో తెలిపారు. అగ్నివీరులు సర్వీసు నుంచి తిరిగి రాగానే పోలీసు సర్వీసు, పీఏసీలో ప్రాధాన్యతా క్రమంలో ఉద్యోగాకావశాలు కల్పిస్తామని చెప్పారు.
శివభక్తులైన కన్విరియాలు ఏటా చేపట్టే కావడి యాత్ర మార్గంలో తినుబండారాల దుకాణాల వద్ద యజమానుల పేర్లు ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై 'మధ్యంతర స్టే'ను సుప్రీంకోర్టు శుక్రవారంనాడు పొడిగించింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.
కార్గిల్ దివస్ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన ప్రకటించారు. సైన్యంలో విధులు నిర్వహించిన అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన అగ్ని వీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.
అండర్ ట్రయల్ ఖైదీ.. మరికాసేపట్లో కోర్టులో హాజరుకావాల్సిన వ్యక్తి.. కూల్ డ్రింక్ తాగి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలే కోల్పోయాడు. ఇప్పుడిదే సంచలనంగా మారింది. నిమిషాల ముందు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి.. కాసేపటికే ప్రాణాలు కోల్పోవడం హాట్ టాపిక్గా మారింది.
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామనగర జిల్లా జిల్లా పేరును బెంగళూరు సౌత్ జిల్లాగా మార్చాలనే ఆలోచనకు మంత్రివర్గం శుక్రవారంనాడు ఆమోదం తెలిపింది. రామనగర ప్రజల డిమాండ్లను పరిశీలించి ఆ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 'నీతి ఆయోగ్' 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో శనివారంనాడు జరుగనుంది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ఈ సమావేశం జరుగుతుందని శుక్రవారంనాడు ఒక అధికార ప్రకటన వెలువడింది.
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవితల జ్యుడిషియల్ కస్టడీ జులై 31 వరకు ఢిల్లీ కోర్టు పొడిగించింది. తీహాడ్ జైల్లోనున్న వీరిని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ కోర్టు ఎదుట పోలీసులు హాజరు పరిచారు. ఢిల్లీ మద్యం కేసులో అవినీతి ఆరోపణల నేపథ్యంలో వీరిని సీబీఐ అరెస్ట్ చేసింది.
సైన్యంలో సంస్కరణల కోసం అగ్నిపథ్ పథకం తీసుకువచ్చామని, విపక్షాలు మాత్రం ఈ పథకంపై యువతను తప్పుదారి పట్టించేలా విమర్శలు చేస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'కార్గిల్' దివస్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టారు. మోదీ ఆబద్ధాలు వ్యాప్తి చేస్తూ, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు.
పంజాబ్ పఠాన్కోట్ జిల్లాలోని ఫాంగ్టోలి గ్రామంలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు స్థానిక మహిళ గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లింది. దాంతో పోలీసులతోపాటు భద్రతాధికారుల వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ క్రమంలో ఉన్నతాధికారులు జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు.