Home » Minister Narayana
Andhrapradesh: రాజధాని ప్రాంతం మునిగిపోయిందని వైసీపీ అసత్య ప్రచారాలు చేసిందని.. రాజధాని పరిసర ప్రాంతాలకి ఎలాంటి ముప్పు లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి ఇలాంటి ఇబ్బందులు తలేత్తకుండా మూడు వాగులని స్టోరేజ్ కెపాసిటీ పెంచుతున్నామని.. అందులో భాగంగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ను డిజైన్ చేస్తున్నామని తెలిపారు.
రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కోసం మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతుల ఇళ్లకు వెళ్లారు. మంత్రి నారాయణ చొరవతో భూములిచ్చేందుకు రైతులుముందుకొస్తున్నారు.
విజయవాడలో పరిస్థితి మెరుగుపడిందని మంత్రి నారాయణ తెలిపారు. ఫైరింజన్లతో ఇళ్లను శుభ్రం చేయిస్తున్నామని అన్నారు. మళ్లీ వరద అంటూ తప్పుడు ప్రచారం చేయడాన్ని వైసీపీ కుట్రగా భావిస్తున్నామని అన్నారు. ఈవిషయంపై ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశామని మంత్రి నారాయణ అన్నారు.
విజయవాడలోని నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్లీ బుడమేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమేనని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. న్యూ ఆర్.ఆర్.పేట,జక్కంపూడి సింగ్ నగర్తో పాటు పలు ప్రాంతాల్లోకి వరద వస్తోందని కాసేపటి క్రితం నుంచి ప్రచారం జరుగుతోందని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
విజయవాడ: నగరంలో పలు చోట్ల జరుగుతున్న వరద నీటి పంపింగ్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. కండ్రిక, జర్నలిస్టు కాలనీ, రాజీవ్ నగర్లో వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. 64 వ డివిజన్ స్పెషల్ ఆఫీసర్ సంపత్ కుమార్తో కలిసి బుడమేరులో వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన శానిటేషన్ పనులపై సంబంధిత అధికారులకు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి మంత్రి నారాయణ ఈరోజు(గురువారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
Andhrapradesh: బుడమేరు ఆక్రమణలు తొలగింపుపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఆక్రమించుకుని ఉన్నవారికి తగు ప్రత్యామ్నాయం చూపించే తొలగిస్తామని తెలిపారు.
Andhrapradesh: బుడమేరు వరద ప్రాంతాల్లో మంత్రి నారాయణ మంగళవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సింగ్ నగర్లో వరద ముంపు తగ్గిందన్నారు. నాలుగైదు డివిజన్లలో లోతట్టు ప్రాంతాల్లో నీరు ఉందన్నారు. కండ్రిక వద్ద రోడ్డు సమాంతరంగా లేదని.. ఒక వైపు నీరు నిలవడంతో మోటార్లతో కాలువలకు మళ్లించామని చెప్పారు.
విజయవాడ: ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి సమయంలోనూ ఆయన వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఖండ్రిక సమీపంలో నున్న - నూజివీడు రహదారి చుట్టుపక్కల ఇప్పటికీ వరద నీరు ఉంది.
పాయకపురంలో వరద ముంపు ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు(సోమవారం) పర్యటించారు. రైతు బజార్ రోడ్డులో వరద నీరు ఉన్న ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు.