Home » Nadendla Manohar
Andhrapradesh: వరదలు, వర్షాలతో భారీగా నష్టం జరిగిందని.. లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారన్నారు.
Andhrapradesh: వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ మొదలైంది. శుక్రవారం మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెంనాయుడు, కందుల దుర్గేష్, ఎంపి కేశినేని చిన్ని నిత్యావసర వస్తువుల వాహనాలను ప్రారంభించారు. ఆపై వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బెంగళూరు పర్యటనలో బిజీగా ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా అడవుల పరిరక్షణలో భాగంగా సినిమా హీరోల గురించి ఆసక్తికరంగా స్పందించారు.
ఢిల్లీలో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) గురువారం నాడు కలిశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని వినతి పత్రం అందజేశారు.
ఏపీ అభివృద్ధి కావాలంటే సమష్టిగా పని చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) సూచించారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ పార్టీ అయినా చర్యలు ఒకేలా ఉంటాయని చెప్పారు.
నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్యులు విలవిల్లాడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని నిర్ణయించింది.
జనసేన (Janasena) క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువును పొడిగించినట్లు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు. మరో వారం రోజులపాటు సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
Andhrapradesh: పార్టీని అంచెలంచెలుగా పెరిగేలా చేయడంలో పవన్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం నాడు.. పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులను అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సత్కరించారు. ముందుగా మంత్రి నాదెండ్లను సత్కరించారు. ప్రజా ప్రతినిధులకు శాలువా కప్పి, గిఫ్ట్ గా కూరగాయలు అందించి పవన్ సన్మానించారు.
Andhrapradesh: ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పెద్ద పండుగ అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రైతులను కలిసిన సమయంలో వారి బాధలు చెప్పారన్నారు. ధాన్యం కొనుగోలు లో కూడా రైతుకు అన్యాయం జరుగుతుందన్నారు.
పౌరసరఫరాల శాఖలో అవినీతి, అక్రమాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు అందించిన రేషన్ సరకుల్లో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి తెలుసుకుని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల ఆకస్మిక తనిఖీలతో అధికారులను పరుగులు పెట్టించిన మంత్రి.. ప్రజలకు ఇచ్చే పంచదార, కందిపప్పు, నూనె వంటి ప్యాకెట్ల తూకంలో తేడాలు గుర్తించి పంపిణీని ఆపేశారు.