Home » Nara Lokesh
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. విదేశాల్లో చదువుతున్న తమ కుమార్తెకు పీజు చెల్లించ లేని పరిస్థితిలో ఉన్నామంటూ ఆ కన్న తండ్రి ప్రజా దర్బార్లో వినతి పత్రాన్ని సమర్పించారు. దీనిపై నారా లోకేశ్ వెంటనే స్పందించారు. ఆయన.. తన వ్యక్తిగత నగదును ఆ విద్యార్థిని చదువు కోసం చెక్కు రూపంలో అందజేశారు.
ఖతర్లోని ఒక అరబ్బు ఇంట్లో పని చేయడానికి వచ్చి మోసపోయి సౌదీ అరేబియాలోని సువిశాల ఎడారిలో ఒంటెల కాపరిగా మారిన ఏపీ వాసిని సారెళ్ళ వీరేంద్రకుమార్ ఎట్టకేలకు మంత్రి నారా లోకేశ్ జోక్యం, అరబ్బు తెగల ప్రయత్నంతో శుక్రవారం స్వదేశానికి చేరుకున్నాడు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ చివరి రోజు కావటంతో విద్య, ఐటీ శాఖమంత్రి నారా లోకేష్కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం నాడు లోకేష్ను పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు కలిశారు. ఈ సందర్భంగా తమ తమ బయోడేటాలు మంత్రికి ఆశావాహులు అందజేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.
అమెరికాలో ఐటీ కంపెనీలు నడుపుతున్న తెలుగువారి ద్వారా రాష్ట్రంలో 40,000 ఐటీ ఉద్యోగాలు సృష్టించడానికి నడుం బిగించాలంటూ టీడీపీలోని ఎన్నారై ఎమ్మెల్యేలకు ఐటీ మంత్రి లోకేశ్ టార్గెట్ పెట్టారు. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగళ్ల రాముతో గురువారం ఉదయం ఆయన ఇక్కడ అసెంబ్లీ లాబీల్లో మాట్లాడారు. ‘అమెరికాలో ఆంధ్రప్రదేశ్కు
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రస్తుతం శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో మరుగుదొడ్లపై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజిలో సరిపడా మరుగుదొడ్లు ఉన్నాయా అంటే మంత్రి ఉన్నాయని అంటున్నారని..
కేంద్రం ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులపై ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృషితో సౌదీ అరేబియాలో చిక్కుకున్న బాధితుడు ఇండియాకు సురక్షితంగా వస్తున్నారు. మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడినట్లు, యువకుణ్ని బుధవారం రోజున దేశానికి తీసుకువస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly)లోని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ఛాంబర్లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఆయనకు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం మెుదటగా ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్తో సహా బీజేపీ ఎమ్మెల్యేలు లోకేశ్ ఛాంబర్కి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు పలు అంశాలపై చర్చించారు.
ఏజెంట్ల చేతిలో మోసపోతూ ఎంతో మంది తెలుగువాళ్లు విదేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కువైట్లో చిక్కుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు లోకేష్ తీవ్రంగా కృషి చేశారు.
హింస, విధ్వంసం, అరాచకం గురించి వైఎస్ జగన్ మాట్లాడితే రోత పుడుతోందని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు.