Home » Praja Darbar
సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు పులివెందలు టీడీపీ ఇనఛార్జ్ బీటెక్ రవి అన్నారు.
భూ సమస్యలపై ఫిర్యాదులు పునరావృతమైతే చర్యలు తప్పవని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతో సుదూర ప్రాంతాల నుంచి కలవడానికి వచ్చిన మహిళలపై రోప్ పార్టీ పోలీసులు దాష్టీకం చూపించారు. సుదూర ప్రాంతాల నుంచి జగన్ను కలిసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానులపై ఇలా పోలీసులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
Andhrapradesh: మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్భార్కు అర్జీదారులు వెల్లువెత్తున్నారు. ప్రజాదర్బార్కు వచ్చి పలువురు ఇస్తున్న అర్జాలను స్వీకరిస్తున్న మంత్రి వారి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామంటూ హామి ఇస్తున్నారు. ఈరోజు (శుక్రవారం) ప్రజాదర్బార్లో మంత్రి నారా లోకేష్ను అనంతపురం ఏఎస్పీగా పనిచేస్తున్న తియోపిల్లాస్ బంధువులు కలిశారు.
హైదరాబాద్లో ఏపీ క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ సంఘం ప్రతినిధులు పవన్కు అర్జీలు సమర్పించారు. తెలంగాణలో ఏపీ వాహనాలు తిరిగేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయనకు మెురపెట్టుకున్నారు. దీంతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబం గడవడం కూడా కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు అధికారం ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు.. బాధ్యతతో వ్యవహరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికే అని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నోసార్లు చెప్పారు.
అమరావతి: ఆపన్నులకు అండగా మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ నిర్వహిస్తున్నారు. సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి జనం పెద్ద ఎత్తున ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచే వస్తున్నారు.
అమరావతి: ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ స్వర్ణకారులకు హామీ ఇచ్చారు. మంగళవారం లోకేష్ నిర్వహించిన ప్రజాదర్బార్కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
ప్రత్యేక యంత్రాంగంతో సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ కృషి చేశారు. వేకువజాము నుంచే ప్రజలు పెద్దఎత్తున బారులు తీరుతున్నారు. బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కు నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపిగ్గా లోకేష్ వింటున్నారు. ఆపై యంత్రాంగం ద్వారా ఆయా శాఖలకు పరిష్కారం కోసం రిఫర్ చేస్తున్నారు.
అమరావతి: మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేశ్కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు.