Share News

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌: బీటెక్‌ రవి

ABN , Publish Date - Sep 03 , 2024 | 11:10 PM

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నట్లు పులివెందలు టీడీపీ ఇనఛార్జ్‌ బీటెక్‌ రవి అన్నారు.

సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌: బీటెక్‌ రవి
ప్రజాదర్బారులో ప్రజల సమస్యలు వింటున్న బీటెక్‌ రవి

పులివెందుల టౌన, సెప్టెంబరు 3 : సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నట్లు పులివెందలు టీడీపీ ఇనఛార్జ్‌ బీటెక్‌ రవి అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్‌ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలు చెప్పుకుని అర్జీలు అందించారు. కొన్నిసమస్యలు ఫోను ద్వారా సంబంధిత అధికారుకలు తెలిపి పరిష్కరించాలని కోరారు. గ్రా మాల నుంచి వచ్చిన ప్రజలు పెద్దఎత్తునతరలివచ్చి వినతిపత్రాలు సమర్పించారు. పెన్షన. రేషనకార్డుల మంజూరు, విద్య, వైద్యం ఉద్యోగాలు ఇప్పించాలని అర్జీలు సమర్పించారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వ పాలన అందిస్తుందన్నారు. ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలని బీటెక్‌ రవి ప్రజలకు సూచించారు. అన్ని సమస్యలు పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 11:10 PM