Home » Prakasam Barrage
Andhrapradesh: బ్యారేజ్ వద్ద చిక్కుకున్న పడవలు 80 టన్నుల బరువు ఉండటంతో అనేకసార్లు ఆటంకాలు ఎదురయ్యాయి. చివరకు కావడి మంత్రం వ్యూహంతో నిన్న (మంగళవారం) నీళ్ల అడుగున ఉన్న బోటును అధికారులు బయటకు తీశారు. భారీ బోటును నిన్న అర్ధరాత్రి గేట్ల వద్ద నుంచి దుర్గా ఘాట్ వరకు సిబ్బంది లాక్కెళ్లారు.
Andhrapradesh: ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపునకు కొత్త విధానం అమలు చేసేందుకు టీంలు సిద్ధమయ్యాయి. రెండు కార్గో బోట్లపై మూడు ఇనప గడ్డర్లను సిబ్బంది అమర్చింది. ఇనుప గడ్డర్లు కదలకుండా బోట్లకు వెల్డింగ్ చేశారు. నీటిలో మునిగి ఉన్న బోటుకు ఇనప గడ్డర్లకు రోప్ లాక్ చేసే విధంగా భారీ హుక్కులు ఏర్పాటు చేశారు.
నదిలో చిక్కుకున్న పడవ నీటిలో మునిగిపోవడంతో రెస్క్యూకి ఆటంకం కలిగింది. లాగే కోద్దీ రోప్, క్రేన్పై బరుబు పెరుగుతోంది. గేట్లకు అడ్డం పడిన పడవను ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి పది అడుగులు ముందకు తీసుకువచ్చారు. అయితే, నీట మునిగిన పడవను కూడా..
Andhrapradesh: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ రెండు రోజుల నుంచి కొనసాగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బోట్స్ కెపాసిటీ 120 టన్నులు కంటే ఎక్కువ ఉన్న కారణంగా లిఫ్ట్ చేయడం కష్టంగా మారిందన్నారు. కట్ చేస్తే 50% వెయిట్ తగ్గుతుందని.. అప్పుడు బోటు పైకి లాగవచ్చన్నారు.
Andhrapradesh: ప్రకాశం బ్యారేజ్ బోట్స్ తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. క్రేన్స్ ద్వారా బోట్స్ తొలగింపు అసాధ్యమని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నది లోపలికి వెళ్లి ప్రకాశం బ్యారేజ్ను ఢీకొన్న బోట్స్ను కట్ చెయ్యాలి అధికారులు నిర్ణయించారు. మొత్తం నాలుగు బోట్లు ఒకదానికి ఒకటి గుద్దుకుని ఇరుక్కుపోవడంతో తొలగింపు చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
భారీ వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీకి కొట్టుకువచ్చిన బోట్లు కౌంటర్ వెయిట్స్ను కాకుండా కట్టడాలను తాకి ఉంటే 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
ప్రకాశం బ్యారేజీ దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి.. 67, 69, 70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల వద్ద ఇంజనీర్లు మరమ్మతులు పూర్తి చేశారు..
అమరావతి: ప్రకాశం బ్యారేజీపై కుట్రలో మరో కోణం వెలుగు చూసింది. బ్యారేజీ స్లూయిజ్ గేట్ల చైన్లు తొలగించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 10 గేట్ల చైన్లు తొలగించడాన్ని చూసి ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. బ్యారేజీకి ఒకవైపు 6, మరోవైపు 4 స్లూయిజ్ గేట్లు ఉంటాయి. బ్యారేజి నీటి మట్టం తగ్గిన సమయంలో గేట్ల కింద ఉన్న వ్యర్థాలను బయటకు పంపేందుకు వాటిని ఆపరేట్ చేస్తారు.
కృష్ణా నది వరద పోటుపై ఉన్న సమయంలోనే ప్రకాశం బ్యారేజీని మూడు ఇనుప బోట్లు ‘కలిసికట్టు’గా ఢీకొట్టడం వెనుక భారీ కుట్ర దాగిఉందా? బ్యారేజీ గేట్లను దెబ్బతీసేందుకే... ఉద్దేశపూర్వకంగా బోట్లను అలా ‘వదిలేశారా?’ ఈ అనుమానాలను బలపరిచే అనేక అంశాలు బయటపడుతున్నాయి. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ...
Andhrapradesh: ప్రకాశం బ్యారేజీకి బోట్స్ ఢీకొన్న వ్యవహారంపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే ఉద్దేశపూర్వకంగా బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టడం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో బ్యారేజీని ఢీకొన్న బోట్లు ఎవరివి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.