Home » Rahul Gandhi
దేశంలో నియంత పాలనను తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రజలకు ఏం చేసిందో చెప్పుకోలేక విపక్షాలపై విమర్శలు గుప్పించడం సిగ్గు చేటన్నారు.
తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాకు 5-10 కిలోలు కోత పెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. కల్లాల వద్ద రైతుల కష్టాలు సర్కారుకు పట్టవా..? అని నిలదీశారు. తరుగుతో సంబంధం లేకుండా మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
కాంగ్రెస్ యువరాజు రాహుల్గాంధీ వాడుతున్న మావోయిస్టు భాష కారణంగా.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ పారిశ్రామిక వేత్త అయినా ఒకటికి యాభైసార్లు ఆలోచిస్తాడని ప్రధాని మోదీ విమర్శించారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కాంగ్రెస్ సభలో తొక్కిసలాట జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫుల్పూర్లో నిర్వహించిన సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ నేతలిద్దరూ వేదికపైకి చేరుకున్న తరువాత.. సభకు వచ్చిన జనం వేదికకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేయగా తొక్కిసలాట జరిగింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కావాలనే ఆశ బలంగా ఉంది. ఆయన ఆశ తప్పకుండా నెరవేరుతుంది. కానీ మన దేశానికి కాదు.. పొరుగున గల పాకిస్థాన్ నుంచి పోటీ చేయాలి.. తప్పకుండా ప్రధాని అవుతారని హిమంత బిశ్వ శర్మ సెటైర్లు వేశారు.
కేంద్రమంత్రి, బీజేపీ అమేథీ లోక్సభ స్థానం అభ్యర్థి స్మృతి ఇరానీని టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో ఆమె అమేథీ..
సార్వత్రిక ఎన్నికలు ముగింపునకు వస్తున్నాయి. ఈ నెల 20వ తేదీన ఐదో విడతలో 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 14 నియోజకవర్గాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి.
వివిధ అంశాలపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం మరోసారి ప్రధాని మోదీకి సవాలు విసిరారు. చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, కానీ ప్రఽధానే ముందుకు రాకపోవచ్చని అన్నారు.
కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ కానేకాదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ నోట వెలువడిన చిట్టచివరి పదాలు ‘హే రామ్’.. కాంగ్రెస్ పార్టీ హిందుత్వ మూలాలకు నిదర్శనమని తేల్చిచెప్పారు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంపైనే తాను ప్రధానంగా దృష్టి కేంద్రీకరించానని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. అందువల్లే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.