Home » Raj Bhavan
తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం 9గంటల సమయంలో రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను శాలువాతో సన్మానించారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
దాదాపు రెండేళ్ల పాటు గవర్నర్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న పలు కీలక బిల్లులకు తెలంగాణ ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు.
నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పి తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఛలోరాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
Telangana: విద్యార్థి, యువజన సంఘాల నేతల రాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన ఐక్య కమిటీ ఆధ్వర్యంలో గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. అయితే అపాయింట్మెంట్ ఇచ్చేందుకు గవర్నర్ నిరాకరించడంతో రాజ్భవన్ ముట్టడికి నేతలు బయలు దేరారు.
గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై వివిధ కథాంశాలతో ‘రామచిలుక’ పేరిట రచించిన తెలుగు అనువాద కథల సంపుటిని రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆవిష్కరించారు.
‘‘సమ్మక్క, సారక్క, జంపన్నలను చంపినవారిగానే కాకతీయ రాజులను నేను చూస్తా. పన్నులు చెల్లించబోం అని అన్నందుకు ఆ గిరిజన యోధులపై దాడి చేసి హతమార్చారు. రుద్రమదేవి హయాం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని రెడ్డి సామంతులు కాపాడారు. ప్రతాపరుద్రుడు వచ్చాక పద్మనాయకులను చేరదీశాడు. వారు చేయివ్వడంతో ఆ సామ్రాజ్యం పతనమైంది’’ అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలుగు ప్రజలకు తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం తెలంగాణ రాజ్భవన్లో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. రాష్ట్రాభివృద్ధిలో మరింత దూకుడుగా వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాజ్భవన్ వేదికగా తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ (Governor Tamilsai, CMKCR) సమక్షంలో ఇవాళ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి పట్నంకు రెండు శాఖలను గులాబీ బాస్ కేటాయించారు..
అవును.. ఇన్నాళ్లుగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్గా (Governor Vs Govt) ఉన్న పరిస్థితులన్నీ ఒకే ఒక్క భేటీతో మారిపోయాయ్.! ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే గవర్నర్ తమిళిసైతో (Governor Tamilisai) సీఎం కేసీఆర్ (CM KCR) రాజీ అయ్యారనే చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..!..
అవును.. పంద్రాగస్టు (August-15th) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై (TS CM KCR) .. రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Tamilsai) మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చెన్నైకి వెళ్లిన గవర్నర్ వేడుకల్లో పాల్గొన్నారు...