Home » Ravichandran Ashwin
భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్కు మాత్రమే పరిమితమయ్యాడు. 37 ఏళ్ల వయసున్న అతడు భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండవ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే నంబర్ 1 స్థానంలో ఉన్నాడు.
చెన్నైలో క్యాంపునకు రావాలని ఆఫ్ స్పిన్నర్ హిమాన్షు సింగ్ను బీసీసీఐ ఆహ్వానించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ 21 ఏళ్ల యువ స్పిన్నర్ బౌలింగ్ యాక్షన్ రవిచంద్రమఅశ్విన్ తరహాలో ఉంటుంది.
టీమిండియా టీ 20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్టేడియంలో జరిగిన ఓ ఘటనను స్పిన్ మెస్ట్రో రవిచంద్రన్ అశ్విన్ రివీల్ చేశారు. వరల్డ్ కప్ గెలవడాన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకు అనుగుణంగా కప్ గెలిచి ద్రావిడ్కు గిప్ట్ ఇవ్వాలని సభ్యులు భావించారు. కలిసికట్టుగా ఆడి, చివరికి కప్పు కొట్టారు.
ఐపీఎల్ 2024లో సోమవారం కీలక పోరు జరగనుంది. ఐదు సార్ల ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో మొదటి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
ఇంగ్లండ్తో ధర్మశాల మ్యాచ్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి తన వందో టెస్టును చిరస్మరణీయం చేసుకున్న టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ర్యాంకింగ్స్లో టాప్ లేపాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ బౌలర్ల జాబితాలో సహచరుడు బుమ్రాను వెనక్కినెట్టి నెంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
చివరిదైన ఐదో టెస్ట్లో ఇంగ్లండ్పై టీమిండియా ఘనవిజయం సాధించింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన ధర్మశాల టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
ఐదో టెస్టులో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. మూడో రోజు ఆటలో తొలి సెషన్లో 259 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు లంచ్ విరామ సమయానికే సగం వికెట్లు కోల్పోయింది.
టీమిండియాతో ఐదో టెస్టు మ్యాచ్లో పర్యాటక జట్టు ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ వేయగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టేల్స్ చెప్పాడు. టాస్ టేల్స్ పడడంతో టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు.
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరిగే ఐదో టెస్టు మ్యాచ్తో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో 100 టెస్టు మ్యాచ్లు పూర్తి చేసుకోబోతున్నాడు. దీంతో 100 టెస్టులు ఆడిన 14వ భారత క్రికెటర్గా నిలవబోతున్నాడు.
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు. ధర్మశాల వేదికగా జరిగే ఐదో టెస్టు మ్యాచ్ ద్వారా వీరిద్దరు తమ తమ వ్యక్తిగత కెరీర్లో 100 టెస్టుల మైలురాయిని చేరుకోబోతున్నారు.