Home » Swiggy
స్విగ్గీ(Swiggy) ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) పరిమాణాన్ని పెంచబోతోంది. కంపెనీ ఇప్పుడు తన IPOలో కొత్త షేర్ల విక్రయం ద్వారా రూ. 5,000 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ఇంతకుముందు ఈ పరిమాణం రూ.3,750 కోట్లుగా ఉండేది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మార్కెట్లో ప్రస్తుతం స్విగ్గీ, జొమాటోలదే రాజ్యం. ఈ మధ్య కాలంలో అత్యధిక లాభాలు సాధిస్తున్న జొమాటో(Zomato) యాప్లోనూ వినూత్న ఫీచర్లు తీసుకొస్తూ ఆకట్టుకుంటోంది.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మహానగరాల్లో చాలా మంది వాటి పైనే ఆధారపడుతున్నారు. బ్యాచిలర్లు, ఉద్యోగాలు చేసే మహిళలు ఉన్న కుటుంబాలు ఎక్కువగా జొమాటో, స్విగ్గీ వంటి వాటిపైనే ఆధారపడుతున్నారు.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ద్వారా వినియోగదారులు ఎక్కువగా ఆర్డర్ చేసుకునే వంటకాల్లో శాఖాహార వంటకాలే అధికంగా ఉంటున్నాయి.
ఆన్లైన్ ఫుడ్ సర్వీస్ మొదలైనప్పటి నుంచి రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్(online food orders) చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధానంగా ఉద్యోగులు, బ్యాచులర్స్ ఈ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. అయితే దేశంలో వెజ్ ఆర్డర్లు ఎక్కువగా వచ్చే నగరాల గురించి స్విగ్గీ కీలక విషయాలను తెలిపింది. ఆవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ(Swiggy) తన IPOను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ కంపెనీకి పెద్ద ఆఫర్ వచ్చింది. ఈ నేపథ్యంలో అమెజాన్ ఇండియా(Amazon india) కంపెనీతో చేతులు కలపాలని ప్రతిపాదించింది.
మెట్రోపాలిటన్ సిటీస్లో ఆన్ లైన్ డెలివరీ బాగా జరుగుతోంది. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీల సంగతి చెప్పక్కర్లేదు. వీక్ డేస్ కన్నా వీకెండ్లో డెలివరీలు ఎక్కువగా ఉంటాయి. పుణేకు చెందిన ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ డెలివరీ కోసం మొబైల్ లోకేషన్ చూసి షాక్ తిన్నాడు.
ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలు(Swiggy, Zomato) షాక్ ఇచ్చాయి. ఇవి తమ ప్లాట్ఫారమ్ ఫీజు ధరలను రూ.6 పెంచినట్లు సమాచారం.
దేశంలో ఆహార డెలివరీ బిజినెస్ 2030 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని బెయిన్ అండ్ కంపెనీ, స్విగ్గీ జాయింట్ రిపోర్ట్ వెల్లడించింది. యూజర్ల సంఖ్య అప్పటికి 45 కోట్ల వరకు చేరొచ్చని అంచనా వేసింది. ‘హౌ ఇండియా ఈట్స్’ పేరుతో ఈ రిపోర్ట్ విడుదల చేశారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ విభాగం 18 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (CAGR) సాధించొచ్చని రిపోర్ట్ తెలిపింది.
గురుగ్రామ్లోని ఓ ఇంటికి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ బాయ్.. బయటే ఉన్న విలువైన నైక్ షూస్ని దొంగిలించాడు. ఈ మధ్యే జరిగిన ఈ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.