Home » Vikarabad
విధి నిర్వహణలో అక్రమాలు, అలసత్వం వహించిన పోలీసులపై వేటు పడింది. భారీ సంఖ్యలో అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
శాసనమండలి సభ్యుడు పట్నం మహేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్కార్ట్ కేటాయించింది. ఈనెల 4న విప్గా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో పైలెట్, ఎస్కార్ట్ వాహనాలను కేటాయించారు.
వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ కేసుకు సంబంధించి బీఆర్ఎస్కు చెందిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలో యువకులను పోలీసులు చితకొట్టారని గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం తెలియడంతో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు.
వికారాబాద్ జిల్లా దామగుండం అడవులు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లపాటు దామగుండం అడవులు కేంద్రానికి అప్పగించేందుకు తాము ఒప్పుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.
పూడూరు మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం సందర్భంగా కొంతమంది యువకులు భారీ ఊరేగింపు చేపట్టారు. సౌండ్ బాక్సులు పెట్టి భారీ శబ్దాలతో హంగామా చేశారు. అయితే అక్కడికి చేరుకున్న ఎస్సై మధుసూదన్.. సౌండ్ బాక్సులకు పర్మిషన్ లేదని, వాటిని ఆపేయాలని యువకులకు సూచించారు.
పరిగి మండలం చిగురాల్పల్లిలో ఎరోళ్ళ మల్లమ్మ అనే వృద్ధురాలి దీన గాథపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వృద్ధురాలికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Telangana: ప్రతి కార్యకర్తను గుర్తించి గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పూర్తి ప్రజాస్వామ్య బద్దంగా పార్టీ ఎన్నికలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ కూడా బీజేపీ నే అని చెప్పుకొచ్చారు.
సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. చాలా వరకు వచ్చిన జీతంలో కొంత సేవింగ్ చేసి.. ఇల్లు కొంటారు. ఇంకొందరు ప్రభుత్వ సహకారంతో పాటుగా తమ కష్టాన్ని కలుపుకొని ఇంటిని నిర్మించుకుంటారు. అయితే.. అక్కడక్కడ పేదల పరిస్థితి దయనీయంగానే ఉంది.
వికారాబాద్ రూరల్ పీరంపల్లిలో కల్తీకల్లు తాగి ఒకరు మృతిచెందారు. మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
వీకెండ్ సెలవులకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరైనా కూడా వెళ్లేందుకు బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అనంతగిరి హిల్స్(ananthagiri hills). పచ్చటి చెట్లతోపాటు పురాతన గుహలు, దేవాలయాలు కూడా ఇక్కడ ఉండటం విశేషం. సహజమైన సౌందర్య సంపదను కలిగి ఉన్న ఈ ప్రాంతానికి ప్రస్తుతం సీజన్లో ఎప్పుడైనా వెళ్లవచ్చు.