Home » Wayanad
వయనాడ్ విపత్తు బాధితులకు తెలంగాణ మంత్రి సీతక్క ఆర్థిక సాయం అందించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు మోహన్ లాల్.. ఆదివారం కొచ్చిలోని అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులతోపాటు కండరాల నొప్పులతో ఆయన బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. వైరల్ ఫీవర్తో ఆయన ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.
వయనాడ్ బాధితులకు మేమున్నామంటూ ఏపీ సర్కార్(AP Govt) ముందుకు వచ్చింది. కేరళ వయనాడ్ బాధిత కుటుంబాల కోసం ఏకంగా రూ.10కోట్ల విరాళాన్ని అందజేసేందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) సర్కార్ నిర్ణయించింది.
కేరళలోని వయనాడ్ జిల్లాలో గత నెల 30న సంభవించిన ప్రకృతి విపత్తుకు మానవ ప్రేరేపిత తప్పిదాల కారణంగా తలెత్తిన వాతావరణ మార్పులే కారణమని వరల్డ్ వెదర్ ఆట్రిబ్యూషన్(డబ్ల్యూడబ్ల్యూఏ) అధ్యయనం
ప్రకృతి సృష్టించి బీభత్సంతో కేరళలో వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమైనాయి. దాంతో గల్లంతైన వారిలో పలువురి ఆచూకీ నేటికి లభ్యం కాలేదు. దీంతో ఓ వైపు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు గాలింపు జరుపుతుంటే.. మరోవైపు బాధిత బంధువులతో పాటు ప్రజలు సైతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు.
పశ్చిమ కనుమల్లో భాగమైన కేరళలోని వయనాడ్లో ప్రకృతి విలయ తాండవం మానవాళికి ఒక హెచ్చరిక అని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు.
కొండచరియలు విరిగిపడి వరదలు పోటెత్తటంతో అతలాకుతలమైన కేరళకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు.
ప్రకృతి సృష్టించిన బీభత్సం కారణంగా వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ యా ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. తీవ్రంగా దెబ్బతిన్న పున్చిరిమట్టం, ముండక్కైతోపాటు చూరల్మల ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో(Wayanad Landslides) ప్రకృతి విపత్తు చూపిన విలయం అంతాఇంతా కాదు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 417 మందికిపైగా చనిపోగా.. 150 మందికిపైగా మృతదేహాల ఆచూకీ ఇంకా లభించలేదు.
ప్రకృతి సృష్టించిన విలయానికి కేరళలోని వయనాడ్ అతలాకుతలమైంది. ఈ పరిస్థితుల్లోనే కొందరు యువకులు తమ ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.